త్వరలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాశానసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ..ఉద్యోగుల నియామక ప్రక్రియను త్వరలోనే చేపడ్తమని, 4 లక్షల 15 వేల 931 మంది ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు.కాగా ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 సంవత్సరాలే. లక్షా 77 వేల 444 ఖాళీలున్నాయని వీటన్నింటిని ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
కబడ్డీలో భారత్ సత్తా ఏంటో మరోసారి ఋజువైంది.ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు ఇరాన్ ను ఓడించి వరుసగా 7వ సారి బంగారు పతకాన్ని దక్కించుకుంది.హోరాహోరీగా జరిగిన ఫైనల్ లో 27-25 తో ఇరాన్ ను చిత్తు చేసింది.
మొదటి హాఫ్ పూర్తయ్యే సమయానికి భారత్ 13-21 స్కోరు తేడాతో వెనకబడింది.ద్వితీయార్థంలో ఒక్కసారిగా పుంజుకున్న భారత్ ఆటగాళ్ళు 14 పాయింట్లు సాధించగా ఇరాన్ కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది.జస్వీర్,రాహుల్,రాకేశ్ రైడింగ్ లో రాణించారు.
1990లో మొదటిసారి ఆసియా క్రీడల్లో కబడ్డీ ఆటను ప్రవేశపెట్టారు.అప్పటినుండి ఇప్పటి వరకు భారత్ పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుస్తూ వస్తుంది.భారత మహిళల జట్టు కూడా ఇరాన్ ను ఫైనల్ లో ఓడించి వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని దక్కించుకుంది
రాష్ట్రపతి,ప్రధాని ఇద్దరూ భారత్ జట్టుకు శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

భారత మహిళా కబడ్డీ జట్టు 17వ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నెగ్గి తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది.ఇది భారత మహిళా కబడ్డీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకం.
శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఇరాన్ పై 31—21 తో గెలిచింది.కబడ్డీలో ఎదురులేని భారత మహిళా జట్టు కష్టపడకుండానే సునాయాసంగా గెలిచింది.గత ఆసియా క్రీడల నుండే మహిళా కబడ్డీ చేర్చారు.
భారత్ మహిళా జట్టు స్వర్ణం గెలవడం గర్వకారణమని,వారికి నా కృతజ్ఞతలు అని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
గురువారం హైదరాబాద్ లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 రెండో సెమీఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ 65 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద ఘనవిజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.అక్టోబర్ 4 శనివారం బెంగళూరులో జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై,కోల్ కతాలు తలబడనున్నాయి.
హోరాహోరీగా జరుగుతుంది అనుకున్న మ్యాచ్ కాస్త ఏకపక్షంగా సాగింది.టాస్ గెలిచిన పంజాబ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.మొదట్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన పంజాబ్ బౌలర్లు చెన్నై మొదటి మూడు వికెట్లు 41 పరుగులకే కూల్చారు.తరువాత జతకలిసిన డుప్లేసిస్,బ్రావో స్కోర్ వేగాన్ని పెంచారు.డుప్లేసిస్ 33 బంతుల్లో 46 పరుగులు చేయగా బ్రావో 39 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్సుల సహాయంతో 67 పరుగులు చేసి ఔటయ్యారు.తరువాత వెంటనే రెండు వికెట్లు కోల్పోయినా చివర్లో జడేజా(27*) వేగంగా పరుగులు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది చెన్నై.
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ క్షణంలోనూ లక్ష్య చేదన దిశగా సాగలేదు.పంజాబ్ భారీ హిట్టర్లు సెహ్వాగ్,మ్యాక్స్ వెల్,పెరేరాలు పరుగులేమి చేయకుండానే అవుటయ్యారు.చెన్నై బౌలర్ల ధాటికి పంజాబ్ ఒక దశలో 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది.చివర్లో అక్షర్ పటేల్ 31 పరుగులు చేయడం,చివరి వికెట్ కు కరణ్ వీర్ సింగ్,అనురీత్ సింగ్ లు 27 పరుగులు జోడించడంతో 117 పరుగులకు ఆలౌట్ అయి ఇంటిదారి పట్టింది.
మ్యాన్ అఫ్ ద మ్యాచ్ డారెన్ బ్రావోకు దక్కింది.
ఐపీఎల్ ఫామ్ నే కొనసాగిస్తూ ఛాంపియన్స్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా నైట్ రైడర్స్ గురువారం హైదరాబాద్ లో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో హోబార్ట్ హరికేన్ పై సునాయాస విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హరికేన్స్ ఆదిలోనే తడబడింది.జట్టు స్కోరు 13 పరుగుల వద్ద మైకేల్,ఫామ్ లో ఉన్న బ్లిజార్డ్ ఇద్దరూ డకౌట్ రూపంలో వెనుదిరిగారు.బెన్ డంక్ 39 పరుగులు,షోయబ్ మాలిక్ 66 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.చావ్లా,పఠాన్,యాదవ్,రస్సెల్,నరైన్ తలా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 20 పరుగుల వద్ద గంభీర్(4),44 పరుగుల వద్ద ఊతప్ప(17) ఔట్ అవడంతో కష్టాల్లో పడ్డట్టు కనిపించింది.కాని కలిస్,పాండేలు సమయోచితంగా ఆడి 63 పరుగులు జోడించారు.32 బంతుల్లో 40 పరుగులు చేసిన మనీష్ పాండే జట్టు స్కోర్ 107 పరుగుల వద్ద పెవీలియన్ బాట పట్టాడు.తరువాత కలిస్ కు జతకలిసిన పఠాన్(14*) మరో వికెట్ పడకుండా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగా విజయాన్ని అందుకున్నారు.కలిస్ 54 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

4x400 మీ రిలేలో భారత్ మహిళల జట్టు 17వ ఆసియా గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.ప్రియాంక పన్వర్,టింటు ల్యుకా,మన్ దీప్ కౌర్,పూవమ్మ లతో కూడిన భారత్ జట్టు 3:28:68 సమయంలో రేసు ముగించి స్వర్ణాన్ని దక్కించుకుంది.దీంతో వరుసగా నాలుగు సార్లు(2002 బూసాన్ ఆసియా క్రీడలనుండి)భారత్ మహిళల రిలే జట్టు స్వర్ణాన్ని గెలుస్తూ వస్తుంది.2010 ఆసియా క్రీడల్లో నమోదు చేసిన సమయం(3:29.02)కంటే ఈసారి అత్యున్నత సమయం నమోదు చేశారు భారత మహిళల రిలే జట్టు.
జపాన్ 3:30.80 సమయంతో రెండోస్థానంలో నిలిచి రజత పతకాన్ని,చైనా 3:32.02 సమయతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాయి.చివరి ల్యాప్ లో పరిగెత్తిన పూవమ్మ అనూహ్యంగా పుంజుకొని జపాన్ క్రీడాకారిణిని వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచి భారత్ కు వరుసగా 4వ స్వర్ణాన్ని అందించింది.
పురుషుల షాట్ పుట్ విభాగంలో 20 సంవత్సరాల ఇందర్జీత్ 19.63 మీటర్లు విసిరి కాంస్య పతాకాన్ని దక్కించుకున్నాడు.ట్రిపుల్ జంప్ లో స్వర్ణాన్ని ఆశించిన అర్పిందర్ సింగ్ 5వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.
భారత అథ్లెట్లు ఇప్పటివరకు 13 పతకాలు గెలుచుకున్నారు.అందులో రెండు స్వర్ణాలు,3 రజత,8 కాంస్యాలు ఉన్నాయి.గత ఆసియా క్రీడల కంటే ఒక పతకాన్ని ఎక్కువగా గెలుచుకున్నా స్వర్ణ పతకాల సంఖ్య మాత్రం తగ్గింది.గతసారి 5 స్వర్ణ,2 రజత,5 కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

ఎట్టకేలకు భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో బంగారు పతాకాన్ని సాధించింది.16 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఫైనల్ లో చిత్తు చేసి స్వర్ణం చేజిక్కించుకుంది.
ఇంచియాన్ వేదికగా జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్ లో భాగంగా పురుషుల హాకీ ఫైనల్ లో భారత్,పాక్ లు తలబడ్డాయి.హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు షూటౌట్ ద్వారా 4-2 తేడాతో పాక్ ను ఓడించి 2016లో జరిగే రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
ఆట నిర్ణీత సమయం 60 నిమిషాల్లో ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూటవుట్ ద్వారా నిర్ణయించారు.భారత గోల్ కీపర్ శ్రీజేష్ పాక్ ఆటగాళ్ళు కొట్టిన షాట్లు గోల్ కాకుండా అధ్బుతంగా అడ్డుకొని భారత్ కు స్వర్ణం అందించడంలో ముఖ్యపాత్ర పోచించాడు.
| Copyright © 2013 Radio Jalsa News