త్వరలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాశానసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ..ఉద్యోగుల నియామక ప్రక్రియను త్వరలోనే చేపడ్తమని, 4 లక్షల 15 వేల 931 మంది ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు.కాగా ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 సంవత్సరాలే. లక్షా 77 వేల 444 ఖాళీలున్నాయని వీటన్నింటిని ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
కబడ్డీలో భారత్ సత్తా ఏంటో మరోసారి ఋజువైంది.ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు ఇరాన్ ను ఓడించి వరుసగా 7వ సారి బంగారు పతకాన్ని దక్కించుకుంది.హోరాహోరీగా జరిగిన ఫైనల్ లో 27-25 తో ఇరాన్ ను చిత్తు చేసింది.
మొదటి హాఫ్ పూర్తయ్యే సమయానికి భారత్ 13-21 స్కోరు తేడాతో వెనకబడింది.ద్వితీయార్థంలో ఒక్కసారిగా పుంజుకున్న భారత్ ఆటగాళ్ళు 14 పాయింట్లు సాధించగా ఇరాన్ కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది.జస్వీర్,రాహుల్,రాకేశ్ రైడింగ్ లో రాణించారు.
1990లో మొదటిసారి ఆసియా క్రీడల్లో కబడ్డీ ఆటను ప్రవేశపెట్టారు.అప్పటినుండి ఇప్పటి వరకు భారత్ పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుస్తూ వస్తుంది.భారత మహిళల జట్టు కూడా ఇరాన్ ను ఫైనల్ లో ఓడించి వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని దక్కించుకుంది
రాష్ట్రపతి,ప్రధాని ఇద్దరూ భారత్ జట్టుకు శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

భారత మహిళా కబడ్డీ జట్టు 17వ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నెగ్గి తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది.ఇది భారత మహిళా కబడ్డీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకం.
శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఇరాన్ పై 31—21 తో గెలిచింది.కబడ్డీలో ఎదురులేని భారత మహిళా జట్టు కష్టపడకుండానే సునాయాసంగా గెలిచింది.గత ఆసియా క్రీడల నుండే మహిళా కబడ్డీ చేర్చారు.
భారత్ మహిళా జట్టు స్వర్ణం గెలవడం గర్వకారణమని,వారికి నా కృతజ్ఞతలు అని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
గురువారం హైదరాబాద్ లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 రెండో సెమీఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ 65 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద ఘనవిజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.అక్టోబర్ 4 శనివారం బెంగళూరులో జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై,కోల్ కతాలు తలబడనున్నాయి.
హోరాహోరీగా జరుగుతుంది అనుకున్న మ్యాచ్ కాస్త ఏకపక్షంగా సాగింది.టాస్ గెలిచిన పంజాబ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.మొదట్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన పంజాబ్ బౌలర్లు చెన్నై మొదటి మూడు వికెట్లు 41 పరుగులకే కూల్చారు.తరువాత జతకలిసిన డుప్లేసిస్,బ్రావో స్కోర్ వేగాన్ని పెంచారు.డుప్లేసిస్ 33 బంతుల్లో 46 పరుగులు చేయగా బ్రావో 39 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్సుల సహాయంతో 67 పరుగులు చేసి ఔటయ్యారు.తరువాత వెంటనే రెండు వికెట్లు కోల్పోయినా చివర్లో జడేజా(27*) వేగంగా పరుగులు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది చెన్నై.
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ క్షణంలోనూ లక్ష్య చేదన దిశగా సాగలేదు.పంజాబ్ భారీ హిట్టర్లు సెహ్వాగ్,మ్యాక్స్ వెల్,పెరేరాలు పరుగులేమి చేయకుండానే అవుటయ్యారు.చెన్నై బౌలర్ల ధాటికి పంజాబ్ ఒక దశలో 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది.చివర్లో అక్షర్ పటేల్ 31 పరుగులు చేయడం,చివరి వికెట్ కు కరణ్ వీర్ సింగ్,అనురీత్ సింగ్ లు 27 పరుగులు జోడించడంతో 117 పరుగులకు ఆలౌట్ అయి ఇంటిదారి పట్టింది.
మ్యాన్ అఫ్ ద మ్యాచ్ డారెన్ బ్రావోకు దక్కింది.
ఐపీఎల్ ఫామ్ నే కొనసాగిస్తూ ఛాంపియన్స్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా నైట్ రైడర్స్ గురువారం హైదరాబాద్ లో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో హోబార్ట్ హరికేన్ పై సునాయాస విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హరికేన్స్ ఆదిలోనే తడబడింది.జట్టు స్కోరు 13 పరుగుల వద్ద మైకేల్,ఫామ్ లో ఉన్న బ్లిజార్డ్ ఇద్దరూ డకౌట్ రూపంలో వెనుదిరిగారు.బెన్ డంక్ 39 పరుగులు,షోయబ్ మాలిక్ 66 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.చావ్లా,పఠాన్,యాదవ్,రస్సెల్,నరైన్ తలా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 20 పరుగుల వద్ద గంభీర్(4),44 పరుగుల వద్ద ఊతప్ప(17) ఔట్ అవడంతో కష్టాల్లో పడ్డట్టు కనిపించింది.కాని కలిస్,పాండేలు సమయోచితంగా ఆడి 63 పరుగులు జోడించారు.32 బంతుల్లో 40 పరుగులు చేసిన మనీష్ పాండే జట్టు స్కోర్ 107 పరుగుల వద్ద పెవీలియన్ బాట పట్టాడు.తరువాత కలిస్ కు జతకలిసిన పఠాన్(14*) మరో వికెట్ పడకుండా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగా విజయాన్ని అందుకున్నారు.కలిస్ 54 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

4x400 మీ రిలేలో భారత్ మహిళల జట్టు 17వ ఆసియా గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.ప్రియాంక పన్వర్,టింటు ల్యుకా,మన్ దీప్ కౌర్,పూవమ్మ లతో కూడిన భారత్ జట్టు 3:28:68 సమయంలో రేసు ముగించి స్వర్ణాన్ని దక్కించుకుంది.దీంతో వరుసగా నాలుగు సార్లు(2002 బూసాన్ ఆసియా క్రీడలనుండి)భారత్ మహిళల రిలే జట్టు స్వర్ణాన్ని గెలుస్తూ వస్తుంది.2010 ఆసియా క్రీడల్లో నమోదు చేసిన సమయం(3:29.02)కంటే ఈసారి అత్యున్నత సమయం నమోదు చేశారు భారత మహిళల రిలే జట్టు.
జపాన్ 3:30.80 సమయంతో రెండోస్థానంలో నిలిచి రజత పతకాన్ని,చైనా 3:32.02 సమయతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాయి.చివరి ల్యాప్ లో పరిగెత్తిన పూవమ్మ అనూహ్యంగా పుంజుకొని జపాన్ క్రీడాకారిణిని వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచి భారత్ కు వరుసగా 4వ స్వర్ణాన్ని అందించింది.
పురుషుల షాట్ పుట్ విభాగంలో 20 సంవత్సరాల ఇందర్జీత్ 19.63 మీటర్లు విసిరి కాంస్య పతాకాన్ని దక్కించుకున్నాడు.ట్రిపుల్ జంప్ లో స్వర్ణాన్ని ఆశించిన అర్పిందర్ సింగ్ 5వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.
భారత అథ్లెట్లు ఇప్పటివరకు 13 పతకాలు గెలుచుకున్నారు.అందులో రెండు స్వర్ణాలు,3 రజత,8 కాంస్యాలు ఉన్నాయి.గత ఆసియా క్రీడల కంటే ఒక పతకాన్ని ఎక్కువగా గెలుచుకున్నా స్వర్ణ పతకాల సంఖ్య మాత్రం తగ్గింది.గతసారి 5 స్వర్ణ,2 రజత,5 కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

ఎట్టకేలకు భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో బంగారు పతాకాన్ని సాధించింది.16 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఫైనల్ లో చిత్తు చేసి స్వర్ణం చేజిక్కించుకుంది.
ఇంచియాన్ వేదికగా జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్ లో భాగంగా పురుషుల హాకీ ఫైనల్ లో భారత్,పాక్ లు తలబడ్డాయి.హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు షూటౌట్ ద్వారా 4-2 తేడాతో పాక్ ను ఓడించి 2016లో జరిగే రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
ఆట నిర్ణీత సమయం 60 నిమిషాల్లో ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూటవుట్ ద్వారా నిర్ణయించారు.భారత గోల్ కీపర్ శ్రీజేష్ పాక్ ఆటగాళ్ళు కొట్టిన షాట్లు గోల్ కాకుండా అధ్బుతంగా అడ్డుకొని భారత్ కు స్వర్ణం అందించడంలో ముఖ్యపాత్ర పోచించాడు.
సినిమాలు విడుదలయ్యాక వాటికి అదనంగా సన్నివేశాలు,పాటలు చేర్చడం తరచుగా చూస్తుంటాం.మన తెలుగు సినిమాల్లో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి.అక్టోబర్ 1న విడుదలైన రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా ఈ కోవలోకే వెళ్తుంది.కుటుంబ కథా చిత్రంగా ఇప్పటికే మంచి టాక్ సంపాదించుకున్న ఈసినిమాకు అదనంగా మరో పాటను చేరుస్తున్నారు.
పాట చిత్రీకరణ కూడా మొదలైంది.దసరా పండగ రోజు కూడా విరామం లేకుండా ఈ పాటను చిత్రీకరించే పనిలో పడ్డారు.మూడు లేదా నాలుగు రోజుల్లో పాటను చేర్చనున్నారు.పాట పూర్తయ్యేవరకు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పని చేయాలని హీరో రామ్ చరణ్ డిసైడ్ అయ్యారు.అయితే ఈసినిమా ప్రిమియర్ షోకు అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకున్న రామ్ చరణ్ పాట చిత్రీకరణ ఉండడంతో ఇక్కడే ఆగిపోయాడు.
ఇది వరకు కూడా రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో కూడా అదనపు సన్నివేశాలు చేర్చారు.మొదట సినిమా నిడివి ఎక్కువైందని భావించి తరువాత సూపర్ హిట్ టాక్ వచ్చాక కొన్ని సన్నివేశాలు కలిపారు.మరి ఇప్పుడు అదనంగా చేర్చుతున్న పాటతో సినిమాకు ప్లస్ అవుతుందో లేదో చూడాలంటే ఇంకో 4 రోజులు ఆగాల్సిందే.
దసరా పండగ రేసులో విడుదలైన 'గోవిందుడు అందరివాడేలే' మొదటి ఆటనుండే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.అక్టోబర్ 1 బుధవారం నాడు రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో మొదటిసారి రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కాజల్ కథానాయిక.బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీకాంత్,కమలినీ ముఖర్జీ,ప్రకాష్ రాజ్,జయసుధ,పోసాని,కోట శ్రీనివాసరావు,రావు రమేష్ ముఖ్య తారాగణం.సినిమా కథా విశేషాల్లోకి వెళ్తే....
ఊరు బాగోగులు కోరుకునే వ్యక్తి బాలరాజు(ప్రకాష్ రాజ్)కు ఇద్దరు కుమారులు.పెద్దవాడు చంద్రశేఖర్(రహమాన్),చిన్నవాడు బంగారం(శ్రీకాంత్).చంద్రశేఖర్ డాక్టర్ కావాలని,ఊరి ప్రజలకు మెరుగైన వైద్యం చేయాలని బాలరాజు కోరుకుంటాడు.డాక్టర్ కావాలనే కోరికను చంద్రశేఖర్ తిరస్కరించడంతో తండ్రీకొడుకులు విడిపోతారు.చంద్రశేఖర్ వెళ్లి లండన్ లో స్థిరపడతారు.చంద్రశేఖర్ కుమారుడు అభిరామ్(రామ్ చరణ్)లండన్ లో పెరిగినా భారతీయ సాంప్రదాయాల పట్ల మంచి గౌరవం ఉంటుంది.
తండ్రికీ.తాతకు మధ్య విభేదాలు ఏంటో తన తండ్రి ద్వారా తెలుసుకున్న అభిరామ్ ఇండియాకు వస్తాడు.బాలరాజు కుటుంబంలో తమ ఫ్యామిలీ కూడా కలపాలని ఆరాటపడే అభిరామ్ అపరిచితునిగా బాలరాజు ఇంట్లోకి ప్రవేశిస్తాడు.అలా వచ్చిన అభిరామ్ తను అనుకున్న లక్ష్యాన్ని అధిగమించాడా?అభిరామ్ ఆ కుటుంబ వారసుడే అని బాలరాజుకు తెలుస్తుందా?తెలిస్తే ఏవిధంగా స్పందిచారు?తన మరదలు సత్య(కాజల్)ప్రేమను ఎలా దక్కించుకున్నాడు?చివరికి ఏమైంది వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
కుటుంబ విలువలు,బాంధవ్యాలు మొదలగు అంశాలు సినిమాలో చక్కగా చూపించారు.రామ్ చరణ్ కుటుంబ కథా చిత్రాలను ఎలా చేస్తాడో అనుకున్నారు,కాని ఊహించినదానికంటే అధ్బుతంగా నటించాడు.ఇప్పటివరకు తను నటించిన చిత్రాలకు ఇది భిన్నం అని చెప్పవచ్చు.నటన పరంగా రామ్ చరణ్ 100 మార్కులు కొట్టేశాడు.రామ్ చరణ్,కాజల్ ల కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగుంటుంది.తెలుగు ప్రేక్షకులకు మంచి కుటుంబ కథా చిత్రం అందించాలని తలచిన దర్శకుడు కృష్ణవంశీ అందులో విజయం సాధించాడు అని చెప్పవచ్చు.ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది.బాలరాజు పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించాడు,ప్రకాష్ రాజ్ మాత్రమే ఇలాంటి పాత్రలకు న్యాయం చేయగలడు అని మరోసారి నిరూపించాడు.
మైనస్ పాయింట్స్
సంగీతం,ఫస్ట్ హాఫ్ కొంత స్లో అయినట్టు అనిపిస్తుంది.రొటీన్ కథే అన్న ఫీలింగ్ కలుగుతుంది.నెగెటివ్ పాత్రలకు ఇంకొంచెం స్ట్రాంగ్ గా డిజైన్ చేయాల్సింది.
పాత్రలకు తగ్గట్టు సినిమాలో ప్రతీఒక్కరూ బాగా నటించారు.జయసుధ,కమలినీ ముఖర్జీ,శ్రీకాంత్,రావు రమేష్,కోట తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.
దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం.మంచి కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశాలు చాలానే ఉన్నాయి.8వ చిత్రం ఫాఫ్ అనే ఫోబియాను రామ్ చరణ్ అధిగమించాడు అని చెప్పొచ్చు .
రేడియో జల్సా రేటింగ్ :3.25/5
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వద్ద రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 12 మంది చనిపోగా 45 మందికి గాయాలయ్యాయి.
మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో రెండు ప్యాసింజర్ రైళ్లు అతి సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
వారణాసి నుండి గోరఖ్ పూర్ వెళుతున్న కృషక్ ఎక్స్ ప్రెస్ లక్నో నుండి బరౌనీకి వెళ్తున్న బరౌనీ ఎక్స్ ప్రెస్ ను ఢీకొంది.ఈ ఘటన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని రైల్వే అధికారి అలోక్ సింగ్ చెప్పారు.బరౌనీ రైలుకు చెందిన మూడు భోగీలు పట్టాలు తప్పాయని సింగ్ తెలిపారు.మరో అధికారి సక్సేనా మాట్లాడుతూ కృషక్ రైలు డ్రైవర్లు సిగ్నల్ పట్టించుకోకుండా ముందుకు సాగడంవల్ల ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.ఆ ఇద్దరు డ్రైవర్లను ఉద్యోగం నుండి వెంటనే తొలిగించారు.
క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

మైక్రోసాఫ్ట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ తన తదుపరి విండోస్ వర్షన్ 10 అని ప్రకటించింది.అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ విండోస్-9 తదుపరి వర్షన్ అనుకున్న ప్రతీ ఒక్కరికి షాక్ ఇస్తూ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ను వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు తెలిపింది.

మంగళవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో సాన్ ఫ్రాన్సిస్కో లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ విషయాలు తెలిశాయి.మైక్రోసాఫ్ట్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ హెడ్ గా ఉన్న టెర్రీ మ్యేర్సన్ ఈ వివరాలు వెల్లడించారు.
టెర్రీ మ్యేర్సన్ వివరాలు చెప్తూ విండోస్ విడుదల చేస్తున్న తదుపరి ఆపరేటింగ్ సిస్టం పేరు విండోస్ 9 ఎందుకు పెట్టలేదో మాత్రం వివరించలేదు.1.5 మిలియన్ మంది ప్రస్తుతం విండోస్ ఉపయోగిస్తున్నారు అని ఈ ఈవెంట్ ను నిర్వహించిన టెర్రీ చిన్న స్టూల్ మీద కూర్చొని వివరించారు.సరికొత్త జనరేషన్ కు విండోస్ 10 ప్రాతినిధ్యం వహిస్తుంది అని టెర్రీ ఆశాభావం వ్యక్తం చేశారు.విండోస్ 10 ఒక సమగ్ర వేదిక కానుంది అని టెర్రీ తెలిపారు.


ఐటీ కారిడార్ లో మహిళా పోలీస్ స్టేషన్ ని పదిరోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలంగాణా మంత్రి కేటిఆర్ తెలిపారు.
నాస్కామ్ ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాస్కాం సమావేశం వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందన్నారు.
ఇతర దేశాల్లో మహిళా రక్షణ కమిటీ పర్యటించి నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో వైఫై ఏర్పాటుకు టెండర్లు పిలిచామన్నారు.
ఐటీ పరిశ్రమలపై వర్కుషాప్ నిర్వహిస్తామని, మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కరీంనగర్, వరంగల్ లోనూ ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
మంత్రి తమది స్నేహపూర్వక పారిశ్రామిక ప్రభుత్వమని పేర్కొన్నారు.
ఆఫ్రికాను వణికిస్తున్న ఎబోలా వైరస్ అంతానికి ఐరాస చేస్తున్న పోరాటానికి భారత్ తనవంతు సాయం చేయనుంది.
భారత్ నేడు 12 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది.
ప్రధాని నరేంద్రమోడి అమెరికా పర్యటనకు బయల్దేరేముందు దీనికి ఆమోదం తెలిపారు.
ఈ మొత్తాన్ని యూఎస్ సెక్రటరీ జనరల్ ఫండ్ కు జమ చేస్తారు.

మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియలో భాగంగా శాస్త్రవేత్తలు మామ్ లోని లామ్ ను మండించారు.ఈ ప్రక్రియ ఎనిమిది దశల్లో జరిగింది.
సక్రమంగా అన్ని ఇంజన్లు పని చేస్తున్నాయని ఇస్రో నిర్ణయించుకున్నది.
మామ్ మార్స్ కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది.అంగారక గ్రహంపై ప్రయోగాల కోసం ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతమైంది.
దీంతో బారత అంతరిక్ష పరిశోధనలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది.
భారత్ అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన నాలుగో దేశంగా గుర్తింపు పొందింది.
మొదటి మూడు
1.అమెరికా
2.రష్యా
3.యూరోపియన్ యూనియన్
4.భారత్
అంగారక కక్ష్యలోకి మొదటి ప్రయత్నంలోనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా, అదేవిధంగా తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో,అతి తక్కవ వ్యయంతో గ్రహాంతర ప్రయోగాన్ని సునాయాసంగా ప్రయోగించిన ఇస్రోను చూసి ప్రపంచమే నివ్వెరపోయింది.
బుధవారం అంగారకుడి కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ ను(మామ్)ఇస్త్ర శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ఉదయం తెల్లవారుజామున 4:49 గంటలకు ప్రారంభమైన కక్ష్య ప్రవేశ ప్రక్రియ 8:05 గంటలకు ముగిసింది.ఇస్రో గ్రాండ్ స్టేషన్ కు ఆ వెంటనే సందేశాలు పంపడం ప్రారంభించింది.
కొద్ది రోజులుగా ఈ ప్రయోగంపై ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న యావత్ భారతదేశం ఈ శుభవార్త విని పులకరించిపోయింది.
కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ అధ్యక్షుడి కొడుకు బిలావల్ భుట్టో వివాదస్పద వాఖ్యలు చేశాడు.
ఎప్పటికైనా కాశ్మీర్ ను పాకిస్థాన్ తో కలుపుతామని వాఖ్యానించాడు.
కాశ్మీర్ లోని ప్రతి అడుగు పాకిస్థాన్ కు చెందినదేనని మాట్లాడాడు.
బిజేపి, బిలావల్ భుట్టో వాఖ్యలపై మండిపడింది.కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ భుభాగంగానే ఉందన్నారు.
భారత ప్రజల హృదయాల్లో కాశ్మీర్ రాష్ట్రం ఉందని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు.
సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ కు మహిళలు, బాలికల భద్రత-రక్షణ కమిటీ తన నివేదికను సమర్పించింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని ఐఏఎస్,ఐ.పీఎస్ అధికారులతో ప్రభుత్వం ఈ కమిటిని నియమించింది.
శనివారం సచివాలయంలో సీఎం కు కమిటీ సభ్యులు 62 పేజీలతో నివేదికను తాయారు చేసి అందజేశారు.
ఉన్నతాధికారులు, అన్నివర్గాల ప్రజలు ఎన్జీవోల నుంచి అభిప్రాయాలను సేకరించి నివేదికను రూపొందించారు.
ఈ నివేదికలో 82 సూచనలు చేశారు.ప్రత్యేకంగా మహిళల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కమిటి తన తుది నివేదికను నవంబర్ నేలాఖరుకల్లా ఇవ్వనున్నట్లు సమాచారం.
కమిటి మిగతా సూచనలు :
1.ఆపదలో ఉన్న మహిళల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు.
2.గ్రామస్థాయిలో నవంబర్ నెలాఖరుకల్లా స్త్రీశక్తి కమిటిల నియామకం.
3.తెలంగాణా రాష్ట్రం కోసం ప్రత్యేక మహిళా కమిషన్ ఏర్పాటు.
4.మహిళల భద్రతపై ప్రతీ జిల్లా కలెక్టర్ నెలకోసారి రివ్యూ చేయాలి.
5.తప్పనిసరిగా పెళ్లిల్ల రిజిస్ట్రేషన్ చేయడం.
6.అన్ని స్కూళ్లలో కాలేజీల్లో బాలికల సంరక్షణ, ప్రైవసీ కోసం ఏర్పాట్లు చేయడం.
7.ఐటీ కార్యాలయాల వద్ద మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడం.
8.సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మహిళల భద్రతను పర్యావేక్షించడం.
9.నగరాలు, పట్టణ ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసి మహిళల భద్రతను పెంచడం.
10.మహిళల భద్రతకు మద్యంను నియంత్రించడం.
11.తద్వారా మహిళలపై జరుగుతోన్న నేరాల సంఖ్యను తగ్గించడం.
12.అందుకు అనుగుణంగా అబ్కారీ విధానాన్ని సవరించడం.
13.మూడంకేలతో హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు.
14.సమస్యల పరిష్కారానికి GHMC పరిధిలో 3 కేంద్రాలు ఏర్పాటు.
15.జిల్లాకో కేంద్రం ఏర్పాటు చేయాలి.
16.ఈ కేంద్రాల్లో సభ్యులుగా కౌన్సిలర్, మహిళా న్యాయవాది, పోలీస్ శాఖ ఉన్నతాధికారి ఉండాలి.
17.వైద్యులు, మహిళా శిశు సంక్షేమ అధికారి సభ్యులుగా ఉండాలి.
18.అన్ని పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు.
19.మహిళలు ఫిర్యాదు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక గది ఏర్పాటు.
20.పోలీస్శాఖలో మహిళలకు 33 % రిజర్వేషన్ అమలు.
21.మహిళలపై వేధింపులు, అత్యాచార ఘటనల్లో 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు.
22.అన్ని జిల్లాల్లో పాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.
23.అత్యాచార ఘటనల్లో అవసరమైతే వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ.
24.ఇంటర్నెట్ లో అసభ్య వెబ్ సైట్లను నిషేధించడం.
25.మహిళలు పనిచేసే ప్రదేశాలు, విద్యా సంస్థల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడం.
భారత సంతతి వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు ఒబామా అత్యంత కీలకమైన రాయబార బాధ్యతలు అప్పగింత నిమిత్తం ఎంపిక చేసుకున్నారు.
ఒబామా భారత్ లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ(45)పేరును ప్రతిపాదించారు.
ఆయన గురువారం రిచర్డ్ రాహుల్ వర్మ పేరును ప్రకటించారు.
భారత ప్రధాని నరేంద్రమోడి త్వరలో అమెరికా పర్యటనకు రానున్న నేపధ్యంలో ఈ కీలక ప్రతిపాదనను ఒబామా చేశారు.
దీంతో పాటు పరిపాలనా యంత్రాంగానికి సంబంధించి మరికొన్ని నియామకాలను ఒబామా చేపట్టారు.
రిచర్డ్ రాహుల్ వర్మ విషయంలో ఒబామా చేసిన ప్రతిపాదనను సెనేట్ ఆమోదించాల్సి ఉండి.
అదే జరిగితే..అత్యంత కీలకమైన ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి అమెరికా పౌరిడిగా రాహుల్ వర్మ ప్రత్యేకతను సాధిస్తారు.
ఆయన అమెరికా విదేశాంగ శాఖతో సహా వివిధ విభాగాల్లో కీలక పదవులు నిర్వహించారు.
ఆయన ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ ఫస్ట్,ది క్లింటన్ ఫౌండేషన్, నేషనల్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూట్ బోర్డు లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాన్సీ పావెల్ రాజీనామా తర్వాత భారత్ లో అమెరికా రాయబారి పదవి ఖాళీగా ఉండి.వర్మ పేరును ఈ కీలకపదవికి ప్రతిపాదించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
ఆసియ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాస్యం సాధించింది.
50మీ పిస్టల్ ఈవెంట్లో భారత్ షూటర్ జితూ రాయ్ భారత్ కు మొదటి స్వర్ణ పతకాన్ని అందించాడు.
ఈ నెలాఖరులో ఒబామాను మోడీ కలవనున్న నేపధ్యంలో అమెరికా ,భారత్ ల మధ్య సైనిక సంబంధాలు సుస్థిరం,సుధ్రుడం చేసుకోవాలని యూ.ఎస్ ఆర్మీ చీఫ్ అన్నారు.
యుధ్అభ్యాన్ 2014కు చైనా అధ్యక్షుని పర్యటనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
యుధ్అభ్యాన్ 2014 పేరిట ఉత్తరాఖండ్ లో అమెరికా,భారత్ ల మధ్య జరుగుతున్న సంయుక్త సైనిక విన్యాసం పదవది.
వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ రాష్టానికి మిలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆర్ధిక సాయం ప్రకటించింది.
రూ.4.25 కోట్ల అత్యవసర ఆర్ధిక సాయాన్ని ఫౌండేషన్ ప్రకటించింది.
శీతల పానియాల విక్రయ సంస్థ కోకా కోలా తాజాగా షుగర్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఇండియన్ మార్కెట్లోకి కోకా-కోలా కంపెనీ'కోకా కోలా జీరో' పేరుతో షుగర్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్ ను తీసుకొచ్చింది.
ఇప్పటివరకు షుగర్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్ టాప్ 6 మార్కెట్లైన యూఎస్ఏ, చైనా, మెక్సికో, బ్రెజిల్,జపాన్లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు దక్షిణాసియా కోకా-కోలా కంపెనీ అధ్యక్షుడు వెంకటేష్ కిని తెలిపారు.
తమ కంపెనీ ఇండియాలో వినియోగదారులకు కోకా-కోలా, థమ్స్ అప్, స్ప్రైట్ తో పాటు కార్బోనేటెడ్, నాన్ కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ని అందుబాటులోకి తిసుకోచ్చినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా అక్టోబర్ 5 తర్వాత కోకా-కోలా జీరో ఉత్పత్తులను 100 కు పైగా పట్టణాల్లో, 1.8 లక్షల బహిరంగ స్టాల్స్ లో అమ్మడానికి సిద్దంగా ఉంటాయని పేర్కొన్నారు.
తెలంగాణా ప్రభుత్వ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటిఆర్ హైదరాబాద్ ను స్మార్ట్ గ్రీన్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
స్మార్ట్ సిటీ అంటే రోడ్ల సౌకర్యాలు మెరుగు పరచడమే కాదని.. ప్రజల అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దడమే ముఖ్యమన్నారు.
మెట్రో పోలీస్ కాంగ్రేస్ ను త్వరలో హైదరాబాద్ లో నిర్వహించనున్న తరుణంలో GHMC, ఆస్కీ,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో వర్క్ షాప్ ను నిర్వహించారు.
వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి కె.తారకరామారావు తెలంగాణా ప్రాంతంలో ఇప్పటికే 39% పట్టణీకరణ చెందిదని చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి రావాలని కేటిఆర్ పిలుపునిచ్చారు.
వచ్చే ఐదేళ్ళ కోసం 14వ ఆర్ధిక సంఘాన్ని తెలంగాణా సర్కార్ సాయం కోరింది.
ఇవాళ రాష్ట్రంలో పర్యటిస్తున్న 14వ ఆర్ధిక సంఘాన్నికి రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించింది.
ఈ ప్రతిపాదనల విలువ రూ.23,475 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు.
వీటిలో పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణకు -రూ.4,216 కోట్లు.
చెరువుల పునరుద్ధరణకు, అభివృద్ధికి-రూ.4,200 కోట్లు.
ఐటీ రంగానికి రూ.1,901 కోట్లు.
వాటర్ గ్రిడ్ కు రూ.3,500 కోట్లు.
హరితహారానికి రూ.1000 కోట్లు.
ప్రాధమిక విద్యకు రూ.1,300 కోట్లు.
వ్యవసాయ విధ్యత్ కోసం రూ.1,300 కోట్లుగా పేర్కొంటూ ప్రతిపాదనలు రూపొందించి సమర్పించింది.
కేంద్ర పన్నుల్లో 50%నికి రాష్ట్రవాటాను పెంచాలని కోరింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన మహేష్ బాబు 'ఆగడు' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట మరియు అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక,తమన్ సంగీతాన్ని అందించారు.సినిమా ఎలావుందో చూద్దాం.
మొదట సినిమా కథ విషయానికే వస్తే శంకర్(మహేష్)ఓ అనాథ,కాని చాల తెలివైన కుర్రాడు.తనలోని చురుకుదనాన్ని చుసిన రాజా రావు(రాజేంద్రప్రసాద్)అనే ఇన్స్ పెక్టర్ శంకర్ ను చేరదీసి పోలీస్ ఆఫీసర్ చేయాలనుకుంటాడు.కాని అనుకోని కారణాలవల్ల చేయని హత్యను తనమీద వేసుకొని జైలుకు వెళుతాడు.అరెస్టయిన శంకర్ బోస్టన్ స్కూల్ లో చదివి పోలీస్ ఆఫీసర్ అవుతాడు.అలా శంకర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొందుతాడు.దాము అలియాస్ దామోదర్(సోనూ సూద్)అక్రమాలను అరికట్టడానికి ఒక గ్రామానికి ట్రాన్స్ ఫర్ చేస్తారు శంకర్ ను.అసలు దాము ఎవరు?శంకర్ జైలుకు వెళ్ళడానికి కారణం ఏంటి? మొదలగునవి తెర మీద చూడాల్సిందే.
మహేష్ బాబు ఇంట్రడక్షన్ తోపాటు మొదటి సాంగ్ చాలా బాగొచ్చింది.సినిమాలో మహేష్ బాబు పంచ్ డైలాగ్ లు బాగానే ఉన్నాయి.అయితే పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువైన ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది.ఇక తమన్నా విషయానికి వస్తే అంతగా ప్రాధాన్యంలేని పాత్ర.మహేష్ బాబుకు ప్రేయసిగా కనిపిస్తుంది.కొన్ని పాటల్లో గ్లామర్ డోస్ పెంచింది.సినిమా మొదటి భాగం బాగానే ఉంటుంది.రెండవ భాగంలోకి వచ్చే సరికి ప్రేక్షకులు కొంత ఇబ్బంది పడతారు.నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది.శీను,పోసాని,రఘుబాబులతో చేయించిన'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీక్వెన్స్ కూడా నవ్వించకపోగా బోర్ కొట్టిస్తుంది.బ్రహ్మనందం బ్రోకర్ పాత్రలో కనిపిస్తాడు కాని అంతగా ఆకట్టుకోలేదు.రొటీన్ కామెడీ తప్పా శ్రీనువైట్ల కామెడీ మాత్రం కనిపించలేదు సినిమాలో.పంచ్ డైలాగ్ లమీద చూపిన శ్రద్ధ సినిమా కథమీద చూపిస్తే సినిమా బాగుండేది.మహేష్ బాబు ఇమేజ్,మహేష్ బాబు పేల్చే డైలాగ్ ల మీడీ శ్రీనువైట్ల ఆధారపడ్డాడు.సినిమా రెండవ భాగం 'దూకుడు' సినిమాను పోలి ఉందని ప్రేక్షకులు పెదవి విరుస్తారు.
ప్లస్ పాయింట్లు
సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమా అంతే మహేష్ అనే చెప్పాలి.మహేష్ పేల్చే పంచ్ డైలాగ్ లు ఆకట్టుకుంటాయి.టోటల్ గా మహేష్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుంది.
మైనస్ పాయింట్లు
ముఖ్యంగా సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం మైనస్ గా నిలిచింది.మూస ధోరణిలో సాగడం,సినిమాలో పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువవడం,సరైన కథ-కథనం లేకపోవడం,రెండవ భాగం,ఎక్కువ నిడివి.

దసరాకు ముందే ప్రేక్షకులను అలరించాలని 'ఆగడు' యూనిట్ అనుకున్నా అందులో సక్సెస్ కాలేదని చెప్పొచ్చు.కాకుంటే ప్రస్తుతానికి పెద్ద హీరోల సినిమాలు ఏవి లేకపోవడంతో కమర్షియల్ గా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

 స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణలో సమైక్యవాదనికే మద్దతు లభించింది. సమైక్య వాదానికి అనుకూలంగా 55% మంది, వ్యతిరేకంగా 45% మంది ప్రజలు ఓటు వేశారు.మొత్తం 43 లక్షల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. యునైటెడ్ కింగ్ డమ్ కే స్కాట్లాండ్ ప్రజలు మద్దతు తెలపడంతో బ్రిటన్-స్కాట్లాండ్ 300 ఏళ్ల నాటి బందం కొనసాగనుంది.గ్రేట్ బ్రిటన్ పాలనలో 1707 నుంచి స్కాట్లాండ్ కొనసాగుతుంది. మొత్తం 32 రాష్ట్రాలు స్కాట్లాండ్ లో ఉండగా, విభజనకు ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు వ్యతిరేకించాయి.4 రాష్ట్రాలు మాత్రమే విభజనకి మద్దతునిచ్చాయి. ప్రజాభిప్రాయ సేకరణలో స్కాట్లాండ్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న విభజన వాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

బీహార్ లోని నలంద యూనివర్సిటీ పునర్ ప్రారంభమైంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ ప్రారంభ వేడుకల్లో ముఖ్యఅథిదిగా హాజరయ్యారు. ఈ సందర్భాంగా సుష్మా మాట్లాడుతూ..భారతీయ అభివృద్ధికి నలంద విశ్వవిద్యాలయం చిహ్నమని,భారతీయ సంస్కృతి వైభవానికి ఈ విశ్వవిద్యాలయం తార్కాణమని చెప్పారు. భారతీయ మేధస్సును నలంద,తక్షశిల విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి చాటి చేప్పాయని కొనియాడారు. సెప్టెంబర్ 1 నుంచి 15 మంది విద్యార్ధులతో నలంద విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయాన్ని 2020 నాటికీ పూర్తి స్థాయిలో నవీకరించానున్నారు.
నగరంలో జరుగనున్న మెట్రో పోలీస్ అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు రూ.5 కోట్లు నిధులు విడుదలయ్యాయి.ఈ నిధులను విడుదల చేస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.
ఈ రోజు హీరో కంపెనీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో హీరో మోటార్ సంస్థకి ఒప్పందం కుదిరింది.
ప్రభుత్వం కంపెనీ ప్రతినిధి రాకేశ్ వశిస్ట్ తో ఈ ఒప్పందం చేసుకుంది.18 నెలల్లో ప్లాంట్ పూర్తయ్యేలా ఒప్పందం చేసుకున్నారు.
హీరో ప్లాంట్ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుంది.
వీలైనంత త్వరగా కర్మాగారం ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ కృషి చేయాలనీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
చైనా సంచార ప్రజలు 10 రోజులుగా తమ గుడారాలను లఢక్ ప్రాంతంలోని దేమ్చాఖ్ లో అక్రమంగా వేసి కొనసాగిస్తున్నారు.
చైనా సైన్యం ప్రోద్బలంతో అక్కడ నిర్మిస్తున్న సాగునీటి కలువకు వ్యతిరేకంగా ఈ గుడారాలను వేశారు. భారత సరిహద్దుకు అర కి.మీ ఈవల ఇవి వేయడం గమనార్హం.
లడఖ్ సెక్టార్ లోని చమురు ప్రాంతంలో చైనా సైన్యం మరోసారి అతిక్రమణకు పాల్పడినట్లు సమాచారం.
చైనా సైన్యం భారత భూభాగంలోకి చోచ్చుకురవడంతో వారిని ఎదురుకోవడానికి ITBP సిబ్బంది, సైన్యం తరలివెళ్లినట్లు తెలుస్తుంది.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మెట్రో ఎండీ N.V.S.రెడ్డి , L&T ఛైర్మెన్ గాడ్గిల్ సమావేశం ముగిసింది.
భేటిలో పురపాలక ముఖ్య కార్యదర్శి జోషి, L&T ప్రతినిధులు పాల్గొన్నారు.సమావేశం ముగిసిన తర్వాత N.V.S.రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం, L&T మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉంటాయని పేర్కొన్నారు.
తాము ఇటువంటివాటికి సమాధానాలు ఇస్తూ ఉంటామని చెప్పారు.మెట్రో పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. సాఫీగా జరుగుతాయని స్పష్టం చేశారు.
తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మ క్యాంటిన్ల అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు,అధికారుల బృందం చెన్నై పర్యటించనుంది.
మంత్రులతో పాటు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చెన్నైలో పర్యటించనున్నారు.
క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్థలం, ఆర్ధిక అంశాలు కూడా పరిశీలిస్తామని మంత్రి సునిత తెలిపారు.

తాజ్ కృష్ణలో కేంద్ర విదేశివ్యవహారాల శాఖ,రాష్ట్ర గ్రామీణాభివృద్ధి,పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన అంశాలపై సదస్సు జరగనుంది.
సదస్సును పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించారు.
ఈ సదస్సులో 15 దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం కేటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు సాధించిన ప్రగతిపై సదస్సులో చర్చించామని చెప్పారు.
అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు.
సదస్సుకు వచ్చిన ప్రతినిధులు మహబూబ్ నగర్,మెదక్ నల్గొండ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు.
మైహూ రజనీకాంత్' పేరుతో హిందీ చిత్రాన్ని నిర్మించడంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎలాంటి అనుమతి లేకుండా తన పేరుపై హిందీ చిత్రాన్ని నిర్మించడంపై మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చైనా అధ్యక్షుడు అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ తో హయత్ హోటల్ లో భేటి అయ్యారు.
ఈ భేటి అనంతరం ఇరు దేశాల అధికారులు మూడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
గుజరాత్ ,గ్వాంగ్ జూ ప్రావిన్స్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులు తొలి ఒప్పందంపై సంతకాలు చేశారు.గుజరాత్ లో పారిశ్రామిక పార్కు ఏర్పాట్లకు వీరి మధ్య ఒప్పందం కుదిరింది.
గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, చైనా డెవలప్ మెంట్ బ్యాంక్ మధ్య రెండో ఒప్పందం జరిగింది. ఉపాధ్యక్షుడు రెండో ఒప్పందంపై , గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పోరేషన్ కార్యదర్శి సంతకాలు చేశారు.
అనంతరం ఈ రోజు సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రయాన్ని సందర్శించారు.
ఈ రోజు సాయంత్రం సతీ సమేతంగా భారత పర్యటనకు వచ్చిన జిన్ పింగ్ కు మోడీ తేనెటీ విందు ఇచ్చారు.
ఆశ్రయంలో సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన తర్వాత ప్రధాని ఇచ్చిన తేనెటీ విందులో జిన్ పింగ్ పాల్గొని రాత్రికి ఆయన ఢిల్లీ బయల్దేరి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ,విదేశీ వ్యవహారాలమంత్రి సుష్మాస్వరాజ్ లతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధిలతో ఆయన భేటి కానున్నారు.



భారత్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఎంటర్ టైనమెంట్ మీడియా రంగం ఒకటి.
దీని వ్యాపార విలువ 2018 నాటికి 2,272 బిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
మంగళవారం వచ్చిన పీడబ్ల్యూసీ-సీఐఐ నివేదిక ప్రకారం ఈ రంగం ఏటా 15 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటోంది.
2012 లో భారత టెలివిజన్ రంగం విలువ రూ.366 బిలియన్లు ఉండగా 2013 నాటికి రూ.420 బిలియన్లకు చేరింది.
టెలివిజన్, మీడియా, వినోద రంగాలు కలిపి 2013 లో రూ.1,120 బిలియన్ల వ్యాపారం చేశాయి.ఆ విలువ అంతకు క్రితం ఏడాది కంటే 19%ఎక్కువ.
విక్రమ్ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఐ',తెలుగులో మనోహరుడు.ఎప్పుడెప్పుడా అని గత రెండు సంవత్సరాలుగు ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.చిత్ర టీజర్ చూసినవారికి కచ్చితంగా సినిమా మీద అంచనాలు పెరిగిపోతాయి.ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.అయితే సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' చిత్ర ఆడియో శిల్పకళా వేదికలో వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు.
చిరంజీవి మాట్లాడడానికి మైక్ తీసుకోగానే అభిమానులు పవన్ గురించి ప్రస్తావించారు.చివర్లో మాట్లాడుతాను అన్నారు కాని అభిమానులు మళ్ళీ అడగడంతో పవన్ ప్రస్థావన తీసుకొచ్చారు చిరంజీవి.'గోవిందుడు అందరివాడేలే' 150 రోజుల ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ వస్తే మీకేమైనా అభ్యంతరమా అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఇంకా చిత్రంలో నటించిన మరియు సాంకేతిక వర్గంలోని ప్రతీ ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యంగా సుద్దాల అశోక్ తేజ రచించిన పాట మనసుని హత్తుకుందని తెలిపారు చిరు.ఒకరోజు సినిమా షూటింగ్ అయ్యాక ఇంటికి వచ్చి సినిమాలో శ్రీకాంత్ తో నటిస్తుంటే సొంత బాబాయ్ తో నటించినట్టుందని రామ్ చరణ్ నాతో అన్నారు,అప్పుడు శ్రీకాంత్ నిజంగానే నీకు బాబాయ్ లాంటి వాడు అని అన్నానని చిరంజీవి తెలిపారు.
గోవిందుడు అందరివాడేలే చిత్ర 150 రోజుల వేడుకకు పవన్ కళ్యాణే వస్తారా లేక రామ్ చరణ్ ఆహ్వానిస్తారా లేకుంటే సినిమా 150 రోజులు ఆడే అంత బాగా ఉంటుందా వేచి చూడాల్సిందే.
శిల్పకళా వేదికలో జరిగిన 'గోవిందుడు అందరివాడేలే' ఆడియో కార్యక్రమంలో చిరంజీవి నటించబోయే 150వ చిత్రానికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది.రామ్ చరణ్ మాట్లాడుతూ నాన్నగారి 150వ చిత్రానికి అమ్మ ద్వారా నేనే నిర్మిస్తాను అని తెలిపారు.అంతకముందు నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ చిరంజీవి గారి 150వ చిత్రాన్ని నిర్మించే అవకాశం నాకు ఇవ్వాలని కోరారు.దీనిమీద స్పందించిన రామ్ చరణ్ ఆ అవకాశం నీకులేదని 150వ చిత్రం నాదే అని చెప్పారు.ఇదే విషయమై చిరంజీవి మాట్లాడుతూ మంచి కథ కోసం చూస్తున్నాను కథ దొరకగానే సినిమా మొదలవుతుంది అని అన్నారు.బహుశ ఈ సంవత్సరం చివరికల్లా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని అన్నారు.ఇంకా మాట్లాడుతూ బండ్ల గణేష్ కు నిర్మాతగా తరువాత చిత్రాల్లో అవకాశం ఇస్తాను అని,అతను బండ్ల గణేష్ కాదని బడ్జెట్ గణేష్ అని చమత్కరించారు చిరంజీవి.

'గోవిందుడు అందరివాడేలే' అన్ని పాటల వీడియో ప్రోమోలు ఆడియో కార్యక్రమం రోజే విడుదల చేశారు.


రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' అక్టోబర్ 1న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.సోమవారం సాయంత్రం శిల్పకళా వేదికగా జరిగిన చిత్ర ఆడియో ఫంక్షన్ లో స్వయంగా హీరో రాంచరణ్ ప్రకటించారు.ఈ ఆడియో కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పరమేశ్వర ఆర్ట్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రానికి కృష్ణవంశి దర్శకత్వం వహించారు.మొదటిసారిగా రామ్ చరణ్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గ నటించింది.
కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ తాలుకా శివల్లి గ్రామంలో వద్దని వారించిన ప్రేమించుకుంటున్నారని కోపంతో ప్రేమికులను అమ్మాయి దగ్గరి బంధువు కొట్టి చంపాడు. 17 సంవత్సరాల నీలమ్మ లక్కమ్మనవార్ 10వ తరగతి చదువుతుంది.నీలమ్మ మరియు కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసిన 19 సంవత్సరాల మహేష్ నైఖర్ అనే అబ్బాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ధార్వాడ్ రూరల్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ కళ్ళప్ప చెప్పినదాని ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నీలమ్మ ఇంట్లో ఎవరు లేరు.అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మాయి బంధువు రంగప్ప లక్కమ్మనవార్ ఆ ఇద్దరినీ ఇంట్లో ఉండడాన్ని గమనించి ఇనుప రాడ్ తో వారిమీద దాడి చేశాడు.అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
అయితే వీరి ప్రేమ వివాహం ఇదివరకే పెద్దవారికి తెలిసి మందలించారు.నీలమ్మ కురుబ కమ్యూనిటీకి చెందగా మహేష్ షెడ్యూల్ కులానికి చెందినవాడు.అమ్మాయికి చెందిన వారు ఇందుకు అభ్యంతరం చెప్పారు.మరియు ఇద్దరినీ హెచ్చరించారు.అయినా వినకపోవడంతో చివరకు ఇద్దరినీ హత మార్చారు.
దేశంలోనే మొదటిసారి ఈ-క్యాబినెట్ నిర్వహించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది.
క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన ప్రతీసారి మంత్రుల చేతిలో పేపర్లు,ఫైళ్లు కనిపిస్తాయి.అందుకు భిన్నంగా సోమవారం చంద్రబాబునాయుడు నిర్వహించిన క్యాబినెట్ కు మంత్రులు ఐపాడ్ లతో హాజరయ్యారు. 1995 నుండి 2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబునాయుడు ఈ-గవర్నెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు.ఈ దఫా కూడా ‘క్లౌడ్’ లాంటి టెక్నాలజీని వాడుకునే పనిలో పడ్డారు చంద్రబాబు.
ప్రస్తుతం ఈ-క్యాబినెట్ కోసం ‘ఫైల్ క్లౌడ్’ టూల్ ద్వారా మంత్రులు మరియు ప్రభుత్వ అధికారులు ఫైల్ షేరింగ్ జరుపుకునే అవకాశం ఉంది. ఇది విజయవంతం అవడంతో ఇకనుండి ఈ విధానాన్నే అనుసరించనున్నారు చంద్రబాబునాయుడు.
ప్రముఖులకు అత్యున్నత పురస్కారల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసులు చేసినట్లు సమాచారం.
మాజీ ప్రధాని పి.వీ నరసింహరావుకు - భారతరత్న,
ప్రొ.జయశంకర్ కు - పద్మభూషణ్,
ప్రొ.రాంరెడ్డికి - పద్మ విభూషణ్
సీనియర్ డైరెక్టర్ నర్సింగరావు ,కాపు రాజయ్యకు - పద్మ శ్రీ,
ప్రభుత్వ రాజముద్ర రూపకర్త ఏలే లక్ష్మణ్, వైకుంఠంకు - పద్మశ్రీ ప్రధానం చేయాలని కోరాలని నిర్ణయించినట్లు సమాచారం.
వీరితో పాటు మరికొంత మంది పేర్లను కూడా కేంద్రానికి సిఫారసు చేసినట్లు సమాచారం.

యువతీ యువకులు ఫేస్ బుక్ మాయలో పడి మోసపోతున్న ఉదంతాలు మనకు తెలుసు.
అయితే ఓ యువకుడు ఫేస్ బుక్ లో కొత్త అమ్మను వెతుక్కుని కన్న తల్లిని వదిలేసిన విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో జరిగింది.
బరేలీ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విజయ్ మౌర్య అనే 20 ఏళ్ల విద్యార్ధి-ఫేస్ బుక్ మమ్మీ కోసం కన్న వారిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.
పొద్దస్తమాను ఫేస్ బుక్ అతుక్కుపోయే అందరి యువకుల్లాగే తన కొడుకు కూడా అన్ని విషయాలు తమ స్నేహితులతో షేర్ చేసుకుంటున్నాడని విజయ్ మౌర్య అనుకున్నాడు.
'ముఖ పుస్తకం'కు అదే పనిగా అంటుకుపోవడాన్ని విజయ్ తండ్రి బ్రిజేష్ అప్పట్లో గమనించినా పెద్దగా పట్టించుకోలేదు.
విజయ్ గతనెల కనిపించకుండా పోయాడు.దీంతో పోలీసులను అతడి తల్లిదండ్రులు ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.
విజయ్ -'ఫేస్ బుక్ మమ్మీ'సుకన్య (పేరు మార్చారు)ని కలుసుకోడానికి వెళ్ళాడని తెలుసుకొని వారంతా అవాక్కయ్యారు.
విజయ్ కేరళకు చెందిన ఆమెని తన తల్లిగా చెప్పుకోవడంతో కన్నవాళ్ళు కన్నీరు మున్నీరయ్యారు. త్రివేండ్రం కు చెందిన సుకన్య బహ్రయిన్ లో నర్స్ గా పని చేస్తుంది.
ఆమే రూ.22 వేలు విజయ్ బ్యాంకు ఖాతాలోకి బదిలీ కూడా చేసింది.అంతేకాదు తన 'ఫేస్ బుక్ కొడుకు' తో ఈ నెల 12 న ఏకంగా బరేలీకి వచ్చింది.
సుకన్య,విజయ్ లు ఇక్కడి నుంచి వెళ్లిపోకుండా పోలీసులు,కుటుంబసభ్యులు వారికి నచ్చజెప్పి ఆపగలిగారు.
ఇక వివాదంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.బీజేపి నాయకులు విజయ్ కుటుంబానికి బాసటగా నిలవడం గమనార్హం.
దీన్ని 'ప్రణాళికబద్దమైన కుట్ర'గా వర్ణించారు.కమలనాధులు హిందూ యువకుడిని క్రిస్టియన్ గా మార్చేందుకు ఈ కుట్ర చేశారని ఆరోపించారు.
అయితే ఫేస్ బుక్ తల్లి కోసం పాకులాడుతూ అసలు తల్లిని వదిలేసిన విజయ్ గురించి వింతగా చెప్పుకుంటున్నారు.ఈ కథ మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
15 రోజుల వ్యవధిలో ఏడుగురిని అత్యంత కర్కశంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్,రేపిస్ట్ ను తమిళనాడు లోని సేలం జిల్లలో పోలీసులు అరెస్ట్ చేశారు.ఏడుగురిలో 5 గురు మహిళలు రెండు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది.
పోలీసుల కథనం ప్రకారం కతిరిపట్టి గ్రామానికి చెందిన 27 సంవత్సరాల సుబ్రహ్మణ్యన్ ట్రక్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు.ఒంటరిగా ఉండే గృహిణులను ముఖ్యంగా లక్ష్యం చేసుకుంటాడు.సేలం,ఆరియలూర్,తిరూచి జిల్లాల్లో తిరుగుతూ హత్యలకు పాల్పడ్డాడు.మూడు హత్యచార కేసులు కూడా ఇతని మీద పోలీసులు నమోదు చేశారు.
పెరియేరి గ్రామంలో ఒక దుకాణంలో దొంగతనం చేస్తూ దుకాణదారుడి మీద దాడి చేస్తుండగా గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.తరువాత పోలీసులు జరిపిన విచారణలో సేలం,అరియాలూర్,తిరూచి జిల్లాలో చేసిన హత్యల గురించి విషయం బయటపడింది.
ఇంట్లో పినతల్లి చిత్రహింసలు భరించలేక తన 17వ ఏట ఇంటి నుండి పారిపోయాడు సుబ్రహ్మణ్యన్.ట్రక్ క్లీనర్ గా ఉద్యోగం చేస్తూ డ్రైవింగ్ నేర్చుకొని ట్రక్ నడుపుతున్నాడు.కాని ఎక్కడ ఒక దగ్గర నిలకడగా పని చేసుకునే వాడు కాదు.నార్త్ ఇండియా లో 5 సంవత్సరాలు ఉండి మల్లి సొంత జిల్లాకు చేరుకున్నాడు.
సుబ్రహ్మణ్యన్ మొదట తన నానమ్మను 2012 లో హత్య చేశాడు.నెల క్రితం వరకు సేలం సెంట్రల్ జైల్లో ఉండి బైల్ మీద విడుదలయ్యాడు.డబ్బు కోసం సేలం,అరియాలూర్ లలో రహదారులమీద రాత్రి వేళల్లో కాపుకాచి ప్రయాణికుల దగ్గర డబ్బులు దోచుకునేవాడు.ఆగష్టు 20 న ఉలిపురంలో చిన్నతయీ(45)అనే ఆవిడ మీద అత్యాచారం చేసి హత్య చేసి ఇంట్లో ఉన్న రూ.10,000 దొంగిలించాడు.మరుసటి రోజు కల్లకుడి లో 82 సంవత్సరాల జయమేలును చంపి రూ.1000 దోచుకేల్లాడు.
సరిగ్గా ఎనిమిది రోజుల తరువాత కైరలబాత్ లో లక్ష్మీ(75),సావిత్రి(50)లను హత్య చేశాడు.సావిత్రిని అత్యాచారం కూడా చేశాడు.వారి ఇంటి నుండి రూ.900 తీసుకెళ్ళాడు.సెప్టెంబర్ 5న సెంతమంగళం గ్ర్రామంలో నిద్రిస్తున్న పార్వతి(25) మీద దాడి చేయగా ఆవిడ భర్త వెలుమురుగన్ అడ్డగించగా అతనిని హత్య చేశాడు,తరువాత ఆవిడమీద అత్యాచారం చేసి చంపేశాడు.వారి 2 సంవత్సరాల చిన్నారిని కూడా చంపేశాడు.అని అత్తూర్ డీఎస్పీ కాసినాతాన్ చెప్పారు.ఇంకా వీడు ఏమైనా నేరాలకు పాల్పడ్డాడ అని పోలీసులు విచారిస్తున్నారు.
గత వారం వ్యభిచారం చేస్తూ బంజారాహిల్స్ లోని ఒక విలాసవంతమైన హోటల్ లో 23 సంవత్సరాల నటి శ్వేత బసు ప్రసాద్ పట్టుబడిన విషయం తెలిసిందే.జాతీయ అవార్డు విజేత అయిన శ్వేత పేరును పోలీసులు బహిరంగా పరిచారు కాని ఆమెతో పట్టుబడిన వ్యాపారవేత్త పేరును మాత్రం బయటపెట్టలేదు అని ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి.పట్టుబడ్డ వ్యాపారవేత్త పేరు కూడా బయటపెట్టాలని పెద్దెత్తున డిమాండ్ వచ్చింది.
ఈ సెక్స్ రాకెట్ తో సంబంధం ఉన్నది ఎవరో తెలుసుకోవాలని కోర్టు అనుకుంటుంది.శ్వేత కేసు ఈరోజు కోర్టులో హియరింగ్ కు రానున్న సందర్భంలో వ్యాపారవేత్త ఎవరో బయటపెట్టాలని కోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాలతో అతను ఎవరో ఈరోజు తెలిసే అవకాశం ఉంది.
అరెస్ట్ చేసిన శ్వేత బసు ప్రసాద్ ను ప్రస్తుతం మహిళా సంరక్షణ గృహంలో ఉంచారు.అయితే చాలా మంది హీరోయిన్స్ వ్యభిచార వృత్తిలో ఉంటున్నారు అని శ్వేత సంచాల వ్యక్యలు చేసింది.
ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పండగ చేస్కో' రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుండి హైదరాబాద్ లో జరుగుతుంది.ఇటీవలే పొల్లాచి లో సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించి తిరిగివచ్చింది.రామ్ కు జతగా రఖుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తుంది.
పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు.ఈ చిత్రంలో హీరో రామ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తారు,హైవోల్టేజి కలిగిన మాస్ క్యారెక్టర్ ను రామ్ ఈ చిత్రంలో పోషిస్తున్నాడు అని డైరెక్టర్ గోపీచంద్ అన్నారు.ఇప్పటి వరకు చిత్ర షూటింగ్ అనుకున్నదానికంటే వేగంగా జరుగుతుంది,తాజాగా సోమవారం(సెప్టెంబర్ 15)నుండి హైదరాబాద్ లో మా చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది అని నిర్మాత కిరీటి అన్నారు.చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
| Copyright © 2013 Radio Jalsa News