ఐటీ కారిడార్ లో మహిళా పోలీస్ స్టేషన్ ని పదిరోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలంగాణా మంత్రి కేటిఆర్ తెలిపారు.
నాస్కామ్ ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాస్కాం సమావేశం వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందన్నారు.
ఇతర దేశాల్లో మహిళా రక్షణ కమిటీ పర్యటించి నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో వైఫై ఏర్పాటుకు టెండర్లు పిలిచామన్నారు.
ఐటీ పరిశ్రమలపై వర్కుషాప్ నిర్వహిస్తామని, మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కరీంనగర్, వరంగల్ లోనూ ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
మంత్రి తమది స్నేహపూర్వక పారిశ్రామిక ప్రభుత్వమని పేర్కొన్నారు.
ఆఫ్రికాను వణికిస్తున్న ఎబోలా వైరస్ అంతానికి ఐరాస చేస్తున్న పోరాటానికి భారత్ తనవంతు సాయం చేయనుంది.
భారత్ నేడు 12 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది.
ప్రధాని నరేంద్రమోడి అమెరికా పర్యటనకు బయల్దేరేముందు దీనికి ఆమోదం తెలిపారు.
ఈ మొత్తాన్ని యూఎస్ సెక్రటరీ జనరల్ ఫండ్ కు జమ చేస్తారు.

మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియలో భాగంగా శాస్త్రవేత్తలు మామ్ లోని లామ్ ను మండించారు.ఈ ప్రక్రియ ఎనిమిది దశల్లో జరిగింది.
సక్రమంగా అన్ని ఇంజన్లు పని చేస్తున్నాయని ఇస్రో నిర్ణయించుకున్నది.
మామ్ మార్స్ కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది.అంగారక గ్రహంపై ప్రయోగాల కోసం ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతమైంది.
దీంతో బారత అంతరిక్ష పరిశోధనలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది.
భారత్ అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన నాలుగో దేశంగా గుర్తింపు పొందింది.
మొదటి మూడు
1.అమెరికా
2.రష్యా
3.యూరోపియన్ యూనియన్
4.భారత్
అంగారక కక్ష్యలోకి మొదటి ప్రయత్నంలోనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా, అదేవిధంగా తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో,అతి తక్కవ వ్యయంతో గ్రహాంతర ప్రయోగాన్ని సునాయాసంగా ప్రయోగించిన ఇస్రోను చూసి ప్రపంచమే నివ్వెరపోయింది.
బుధవారం అంగారకుడి కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ ను(మామ్)ఇస్త్ర శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ఉదయం తెల్లవారుజామున 4:49 గంటలకు ప్రారంభమైన కక్ష్య ప్రవేశ ప్రక్రియ 8:05 గంటలకు ముగిసింది.ఇస్రో గ్రాండ్ స్టేషన్ కు ఆ వెంటనే సందేశాలు పంపడం ప్రారంభించింది.
కొద్ది రోజులుగా ఈ ప్రయోగంపై ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న యావత్ భారతదేశం ఈ శుభవార్త విని పులకరించిపోయింది.
కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్ అధ్యక్షుడి కొడుకు బిలావల్ భుట్టో వివాదస్పద వాఖ్యలు చేశాడు.
ఎప్పటికైనా కాశ్మీర్ ను పాకిస్థాన్ తో కలుపుతామని వాఖ్యానించాడు.
కాశ్మీర్ లోని ప్రతి అడుగు పాకిస్థాన్ కు చెందినదేనని మాట్లాడాడు.
బిజేపి, బిలావల్ భుట్టో వాఖ్యలపై మండిపడింది.కాశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ భుభాగంగానే ఉందన్నారు.
భారత ప్రజల హృదయాల్లో కాశ్మీర్ రాష్ట్రం ఉందని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ అన్నారు.
సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ కు మహిళలు, బాలికల భద్రత-రక్షణ కమిటీ తన నివేదికను సమర్పించింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని ఐఏఎస్,ఐ.పీఎస్ అధికారులతో ప్రభుత్వం ఈ కమిటిని నియమించింది.
శనివారం సచివాలయంలో సీఎం కు కమిటీ సభ్యులు 62 పేజీలతో నివేదికను తాయారు చేసి అందజేశారు.
ఉన్నతాధికారులు, అన్నివర్గాల ప్రజలు ఎన్జీవోల నుంచి అభిప్రాయాలను సేకరించి నివేదికను రూపొందించారు.
ఈ నివేదికలో 82 సూచనలు చేశారు.ప్రత్యేకంగా మహిళల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కమిటి తన తుది నివేదికను నవంబర్ నేలాఖరుకల్లా ఇవ్వనున్నట్లు సమాచారం.
కమిటి మిగతా సూచనలు :
1.ఆపదలో ఉన్న మహిళల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు.
2.గ్రామస్థాయిలో నవంబర్ నెలాఖరుకల్లా స్త్రీశక్తి కమిటిల నియామకం.
3.తెలంగాణా రాష్ట్రం కోసం ప్రత్యేక మహిళా కమిషన్ ఏర్పాటు.
4.మహిళల భద్రతపై ప్రతీ జిల్లా కలెక్టర్ నెలకోసారి రివ్యూ చేయాలి.
5.తప్పనిసరిగా పెళ్లిల్ల రిజిస్ట్రేషన్ చేయడం.
6.అన్ని స్కూళ్లలో కాలేజీల్లో బాలికల సంరక్షణ, ప్రైవసీ కోసం ఏర్పాట్లు చేయడం.
7.ఐటీ కార్యాలయాల వద్ద మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడం.
8.సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మహిళల భద్రతను పర్యావేక్షించడం.
9.నగరాలు, పట్టణ ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసి మహిళల భద్రతను పెంచడం.
10.మహిళల భద్రతకు మద్యంను నియంత్రించడం.
11.తద్వారా మహిళలపై జరుగుతోన్న నేరాల సంఖ్యను తగ్గించడం.
12.అందుకు అనుగుణంగా అబ్కారీ విధానాన్ని సవరించడం.
13.మూడంకేలతో హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు.
14.సమస్యల పరిష్కారానికి GHMC పరిధిలో 3 కేంద్రాలు ఏర్పాటు.
15.జిల్లాకో కేంద్రం ఏర్పాటు చేయాలి.
16.ఈ కేంద్రాల్లో సభ్యులుగా కౌన్సిలర్, మహిళా న్యాయవాది, పోలీస్ శాఖ ఉన్నతాధికారి ఉండాలి.
17.వైద్యులు, మహిళా శిశు సంక్షేమ అధికారి సభ్యులుగా ఉండాలి.
18.అన్ని పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు.
19.మహిళలు ఫిర్యాదు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక గది ఏర్పాటు.
20.పోలీస్శాఖలో మహిళలకు 33 % రిజర్వేషన్ అమలు.
21.మహిళలపై వేధింపులు, అత్యాచార ఘటనల్లో 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు.
22.అన్ని జిల్లాల్లో పాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.
23.అత్యాచార ఘటనల్లో అవసరమైతే వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ.
24.ఇంటర్నెట్ లో అసభ్య వెబ్ సైట్లను నిషేధించడం.
25.మహిళలు పనిచేసే ప్రదేశాలు, విద్యా సంస్థల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడం.
భారత సంతతి వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు ఒబామా అత్యంత కీలకమైన రాయబార బాధ్యతలు అప్పగింత నిమిత్తం ఎంపిక చేసుకున్నారు.
ఒబామా భారత్ లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ(45)పేరును ప్రతిపాదించారు.
ఆయన గురువారం రిచర్డ్ రాహుల్ వర్మ పేరును ప్రకటించారు.
భారత ప్రధాని నరేంద్రమోడి త్వరలో అమెరికా పర్యటనకు రానున్న నేపధ్యంలో ఈ కీలక ప్రతిపాదనను ఒబామా చేశారు.
దీంతో పాటు పరిపాలనా యంత్రాంగానికి సంబంధించి మరికొన్ని నియామకాలను ఒబామా చేపట్టారు.
రిచర్డ్ రాహుల్ వర్మ విషయంలో ఒబామా చేసిన ప్రతిపాదనను సెనేట్ ఆమోదించాల్సి ఉండి.
అదే జరిగితే..అత్యంత కీలకమైన ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి అమెరికా పౌరిడిగా రాహుల్ వర్మ ప్రత్యేకతను సాధిస్తారు.
ఆయన అమెరికా విదేశాంగ శాఖతో సహా వివిధ విభాగాల్లో కీలక పదవులు నిర్వహించారు.
ఆయన ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ ఫస్ట్,ది క్లింటన్ ఫౌండేషన్, నేషనల్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూట్ బోర్డు లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాన్సీ పావెల్ రాజీనామా తర్వాత భారత్ లో అమెరికా రాయబారి పదవి ఖాళీగా ఉండి.వర్మ పేరును ఈ కీలకపదవికి ప్రతిపాదించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.
ఆసియ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదరి కాస్యం సాధించింది.
50మీ పిస్టల్ ఈవెంట్లో భారత్ షూటర్ జితూ రాయ్ భారత్ కు మొదటి స్వర్ణ పతకాన్ని అందించాడు.
ఈ నెలాఖరులో ఒబామాను మోడీ కలవనున్న నేపధ్యంలో అమెరికా ,భారత్ ల మధ్య సైనిక సంబంధాలు సుస్థిరం,సుధ్రుడం చేసుకోవాలని యూ.ఎస్ ఆర్మీ చీఫ్ అన్నారు.
యుధ్అభ్యాన్ 2014కు చైనా అధ్యక్షుని పర్యటనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
యుధ్అభ్యాన్ 2014 పేరిట ఉత్తరాఖండ్ లో అమెరికా,భారత్ ల మధ్య జరుగుతున్న సంయుక్త సైనిక విన్యాసం పదవది.
వరదలతో అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ రాష్టానికి మిలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆర్ధిక సాయం ప్రకటించింది.
రూ.4.25 కోట్ల అత్యవసర ఆర్ధిక సాయాన్ని ఫౌండేషన్ ప్రకటించింది.
శీతల పానియాల విక్రయ సంస్థ కోకా కోలా తాజాగా షుగర్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఇండియన్ మార్కెట్లోకి కోకా-కోలా కంపెనీ'కోకా కోలా జీరో' పేరుతో షుగర్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్ ను తీసుకొచ్చింది.
ఇప్పటివరకు షుగర్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్ టాప్ 6 మార్కెట్లైన యూఎస్ఏ, చైనా, మెక్సికో, బ్రెజిల్,జపాన్లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు దక్షిణాసియా కోకా-కోలా కంపెనీ అధ్యక్షుడు వెంకటేష్ కిని తెలిపారు.
తమ కంపెనీ ఇండియాలో వినియోగదారులకు కోకా-కోలా, థమ్స్ అప్, స్ప్రైట్ తో పాటు కార్బోనేటెడ్, నాన్ కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ని అందుబాటులోకి తిసుకోచ్చినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా అక్టోబర్ 5 తర్వాత కోకా-కోలా జీరో ఉత్పత్తులను 100 కు పైగా పట్టణాల్లో, 1.8 లక్షల బహిరంగ స్టాల్స్ లో అమ్మడానికి సిద్దంగా ఉంటాయని పేర్కొన్నారు.
తెలంగాణా ప్రభుత్వ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటిఆర్ హైదరాబాద్ ను స్మార్ట్ గ్రీన్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
స్మార్ట్ సిటీ అంటే రోడ్ల సౌకర్యాలు మెరుగు పరచడమే కాదని.. ప్రజల అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దడమే ముఖ్యమన్నారు.
మెట్రో పోలీస్ కాంగ్రేస్ ను త్వరలో హైదరాబాద్ లో నిర్వహించనున్న తరుణంలో GHMC, ఆస్కీ,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో వర్క్ షాప్ ను నిర్వహించారు.
వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి కె.తారకరామారావు తెలంగాణా ప్రాంతంలో ఇప్పటికే 39% పట్టణీకరణ చెందిదని చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి రావాలని కేటిఆర్ పిలుపునిచ్చారు.
వచ్చే ఐదేళ్ళ కోసం 14వ ఆర్ధిక సంఘాన్ని తెలంగాణా సర్కార్ సాయం కోరింది.
ఇవాళ రాష్ట్రంలో పర్యటిస్తున్న 14వ ఆర్ధిక సంఘాన్నికి రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించింది.
ఈ ప్రతిపాదనల విలువ రూ.23,475 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు.
వీటిలో పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణకు -రూ.4,216 కోట్లు.
చెరువుల పునరుద్ధరణకు, అభివృద్ధికి-రూ.4,200 కోట్లు.
ఐటీ రంగానికి రూ.1,901 కోట్లు.
వాటర్ గ్రిడ్ కు రూ.3,500 కోట్లు.
హరితహారానికి రూ.1000 కోట్లు.
ప్రాధమిక విద్యకు రూ.1,300 కోట్లు.
వ్యవసాయ విధ్యత్ కోసం రూ.1,300 కోట్లుగా పేర్కొంటూ ప్రతిపాదనలు రూపొందించి సమర్పించింది.
కేంద్ర పన్నుల్లో 50%నికి రాష్ట్రవాటాను పెంచాలని కోరింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన మహేష్ బాబు 'ఆగడు' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట మరియు అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక,తమన్ సంగీతాన్ని అందించారు.సినిమా ఎలావుందో చూద్దాం.
మొదట సినిమా కథ విషయానికే వస్తే శంకర్(మహేష్)ఓ అనాథ,కాని చాల తెలివైన కుర్రాడు.తనలోని చురుకుదనాన్ని చుసిన రాజా రావు(రాజేంద్రప్రసాద్)అనే ఇన్స్ పెక్టర్ శంకర్ ను చేరదీసి పోలీస్ ఆఫీసర్ చేయాలనుకుంటాడు.కాని అనుకోని కారణాలవల్ల చేయని హత్యను తనమీద వేసుకొని జైలుకు వెళుతాడు.అరెస్టయిన శంకర్ బోస్టన్ స్కూల్ లో చదివి పోలీస్ ఆఫీసర్ అవుతాడు.అలా శంకర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొందుతాడు.దాము అలియాస్ దామోదర్(సోనూ సూద్)అక్రమాలను అరికట్టడానికి ఒక గ్రామానికి ట్రాన్స్ ఫర్ చేస్తారు శంకర్ ను.అసలు దాము ఎవరు?శంకర్ జైలుకు వెళ్ళడానికి కారణం ఏంటి? మొదలగునవి తెర మీద చూడాల్సిందే.
మహేష్ బాబు ఇంట్రడక్షన్ తోపాటు మొదటి సాంగ్ చాలా బాగొచ్చింది.సినిమాలో మహేష్ బాబు పంచ్ డైలాగ్ లు బాగానే ఉన్నాయి.అయితే పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువైన ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది.ఇక తమన్నా విషయానికి వస్తే అంతగా ప్రాధాన్యంలేని పాత్ర.మహేష్ బాబుకు ప్రేయసిగా కనిపిస్తుంది.కొన్ని పాటల్లో గ్లామర్ డోస్ పెంచింది.సినిమా మొదటి భాగం బాగానే ఉంటుంది.రెండవ భాగంలోకి వచ్చే సరికి ప్రేక్షకులు కొంత ఇబ్బంది పడతారు.నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది.శీను,పోసాని,రఘుబాబులతో చేయించిన'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీక్వెన్స్ కూడా నవ్వించకపోగా బోర్ కొట్టిస్తుంది.బ్రహ్మనందం బ్రోకర్ పాత్రలో కనిపిస్తాడు కాని అంతగా ఆకట్టుకోలేదు.రొటీన్ కామెడీ తప్పా శ్రీనువైట్ల కామెడీ మాత్రం కనిపించలేదు సినిమాలో.పంచ్ డైలాగ్ లమీద చూపిన శ్రద్ధ సినిమా కథమీద చూపిస్తే సినిమా బాగుండేది.మహేష్ బాబు ఇమేజ్,మహేష్ బాబు పేల్చే డైలాగ్ ల మీడీ శ్రీనువైట్ల ఆధారపడ్డాడు.సినిమా రెండవ భాగం 'దూకుడు' సినిమాను పోలి ఉందని ప్రేక్షకులు పెదవి విరుస్తారు.
ప్లస్ పాయింట్లు
సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమా అంతే మహేష్ అనే చెప్పాలి.మహేష్ పేల్చే పంచ్ డైలాగ్ లు ఆకట్టుకుంటాయి.టోటల్ గా మహేష్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుంది.
మైనస్ పాయింట్లు
ముఖ్యంగా సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం మైనస్ గా నిలిచింది.మూస ధోరణిలో సాగడం,సినిమాలో పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువవడం,సరైన కథ-కథనం లేకపోవడం,రెండవ భాగం,ఎక్కువ నిడివి.

దసరాకు ముందే ప్రేక్షకులను అలరించాలని 'ఆగడు' యూనిట్ అనుకున్నా అందులో సక్సెస్ కాలేదని చెప్పొచ్చు.కాకుంటే ప్రస్తుతానికి పెద్ద హీరోల సినిమాలు ఏవి లేకపోవడంతో కమర్షియల్ గా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

 స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణలో సమైక్యవాదనికే మద్దతు లభించింది. సమైక్య వాదానికి అనుకూలంగా 55% మంది, వ్యతిరేకంగా 45% మంది ప్రజలు ఓటు వేశారు.మొత్తం 43 లక్షల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. యునైటెడ్ కింగ్ డమ్ కే స్కాట్లాండ్ ప్రజలు మద్దతు తెలపడంతో బ్రిటన్-స్కాట్లాండ్ 300 ఏళ్ల నాటి బందం కొనసాగనుంది.గ్రేట్ బ్రిటన్ పాలనలో 1707 నుంచి స్కాట్లాండ్ కొనసాగుతుంది. మొత్తం 32 రాష్ట్రాలు స్కాట్లాండ్ లో ఉండగా, విభజనకు ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు వ్యతిరేకించాయి.4 రాష్ట్రాలు మాత్రమే విభజనకి మద్దతునిచ్చాయి. ప్రజాభిప్రాయ సేకరణలో స్కాట్లాండ్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న విభజన వాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

బీహార్ లోని నలంద యూనివర్సిటీ పునర్ ప్రారంభమైంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ ప్రారంభ వేడుకల్లో ముఖ్యఅథిదిగా హాజరయ్యారు. ఈ సందర్భాంగా సుష్మా మాట్లాడుతూ..భారతీయ అభివృద్ధికి నలంద విశ్వవిద్యాలయం చిహ్నమని,భారతీయ సంస్కృతి వైభవానికి ఈ విశ్వవిద్యాలయం తార్కాణమని చెప్పారు. భారతీయ మేధస్సును నలంద,తక్షశిల విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి చాటి చేప్పాయని కొనియాడారు. సెప్టెంబర్ 1 నుంచి 15 మంది విద్యార్ధులతో నలంద విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయాన్ని 2020 నాటికీ పూర్తి స్థాయిలో నవీకరించానున్నారు.
నగరంలో జరుగనున్న మెట్రో పోలీస్ అంతర్జాతీయ మేయర్ల సదస్సుకు రూ.5 కోట్లు నిధులు విడుదలయ్యాయి.ఈ నిధులను విడుదల చేస్తూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.
ఈ రోజు హీరో కంపెనీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో హీరో మోటార్ సంస్థకి ఒప్పందం కుదిరింది.
ప్రభుత్వం కంపెనీ ప్రతినిధి రాకేశ్ వశిస్ట్ తో ఈ ఒప్పందం చేసుకుంది.18 నెలల్లో ప్లాంట్ పూర్తయ్యేలా ఒప్పందం చేసుకున్నారు.
హీరో ప్లాంట్ ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుంది.
వీలైనంత త్వరగా కర్మాగారం ఏర్పాటు చేసేందుకు హీరో సంస్థ కృషి చేయాలనీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
చైనా సంచార ప్రజలు 10 రోజులుగా తమ గుడారాలను లఢక్ ప్రాంతంలోని దేమ్చాఖ్ లో అక్రమంగా వేసి కొనసాగిస్తున్నారు.
చైనా సైన్యం ప్రోద్బలంతో అక్కడ నిర్మిస్తున్న సాగునీటి కలువకు వ్యతిరేకంగా ఈ గుడారాలను వేశారు. భారత సరిహద్దుకు అర కి.మీ ఈవల ఇవి వేయడం గమనార్హం.
లడఖ్ సెక్టార్ లోని చమురు ప్రాంతంలో చైనా సైన్యం మరోసారి అతిక్రమణకు పాల్పడినట్లు సమాచారం.
చైనా సైన్యం భారత భూభాగంలోకి చోచ్చుకురవడంతో వారిని ఎదురుకోవడానికి ITBP సిబ్బంది, సైన్యం తరలివెళ్లినట్లు తెలుస్తుంది.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మెట్రో ఎండీ N.V.S.రెడ్డి , L&T ఛైర్మెన్ గాడ్గిల్ సమావేశం ముగిసింది.
భేటిలో పురపాలక ముఖ్య కార్యదర్శి జోషి, L&T ప్రతినిధులు పాల్గొన్నారు.సమావేశం ముగిసిన తర్వాత N.V.S.రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం, L&T మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉంటాయని పేర్కొన్నారు.
తాము ఇటువంటివాటికి సమాధానాలు ఇస్తూ ఉంటామని చెప్పారు.మెట్రో పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. సాఫీగా జరుగుతాయని స్పష్టం చేశారు.
తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మ క్యాంటిన్ల అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు,అధికారుల బృందం చెన్నై పర్యటించనుంది.
మంత్రులతో పాటు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చెన్నైలో పర్యటించనున్నారు.
క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్థలం, ఆర్ధిక అంశాలు కూడా పరిశీలిస్తామని మంత్రి సునిత తెలిపారు.

తాజ్ కృష్ణలో కేంద్ర విదేశివ్యవహారాల శాఖ,రాష్ట్ర గ్రామీణాభివృద్ధి,పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన అంశాలపై సదస్సు జరగనుంది.
సదస్సును పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించారు.
ఈ సదస్సులో 15 దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం కేటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు సాధించిన ప్రగతిపై సదస్సులో చర్చించామని చెప్పారు.
అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు.
సదస్సుకు వచ్చిన ప్రతినిధులు మహబూబ్ నగర్,మెదక్ నల్గొండ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు.
మైహూ రజనీకాంత్' పేరుతో హిందీ చిత్రాన్ని నిర్మించడంపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎలాంటి అనుమతి లేకుండా తన పేరుపై హిందీ చిత్రాన్ని నిర్మించడంపై మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చైనా అధ్యక్షుడు అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ తో హయత్ హోటల్ లో భేటి అయ్యారు.
ఈ భేటి అనంతరం ఇరు దేశాల అధికారులు మూడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
గుజరాత్ ,గ్వాంగ్ జూ ప్రావిన్స్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులు తొలి ఒప్పందంపై సంతకాలు చేశారు.గుజరాత్ లో పారిశ్రామిక పార్కు ఏర్పాట్లకు వీరి మధ్య ఒప్పందం కుదిరింది.
గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, చైనా డెవలప్ మెంట్ బ్యాంక్ మధ్య రెండో ఒప్పందం జరిగింది. ఉపాధ్యక్షుడు రెండో ఒప్పందంపై , గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పోరేషన్ కార్యదర్శి సంతకాలు చేశారు.
అనంతరం ఈ రోజు సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రయాన్ని సందర్శించారు.
ఈ రోజు సాయంత్రం సతీ సమేతంగా భారత పర్యటనకు వచ్చిన జిన్ పింగ్ కు మోడీ తేనెటీ విందు ఇచ్చారు.
ఆశ్రయంలో సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన తర్వాత ప్రధాని ఇచ్చిన తేనెటీ విందులో జిన్ పింగ్ పాల్గొని రాత్రికి ఆయన ఢిల్లీ బయల్దేరి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ,విదేశీ వ్యవహారాలమంత్రి సుష్మాస్వరాజ్ లతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధిలతో ఆయన భేటి కానున్నారు.



భారత్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఎంటర్ టైనమెంట్ మీడియా రంగం ఒకటి.
దీని వ్యాపార విలువ 2018 నాటికి 2,272 బిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
మంగళవారం వచ్చిన పీడబ్ల్యూసీ-సీఐఐ నివేదిక ప్రకారం ఈ రంగం ఏటా 15 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటోంది.
2012 లో భారత టెలివిజన్ రంగం విలువ రూ.366 బిలియన్లు ఉండగా 2013 నాటికి రూ.420 బిలియన్లకు చేరింది.
టెలివిజన్, మీడియా, వినోద రంగాలు కలిపి 2013 లో రూ.1,120 బిలియన్ల వ్యాపారం చేశాయి.ఆ విలువ అంతకు క్రితం ఏడాది కంటే 19%ఎక్కువ.
విక్రమ్ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఐ',తెలుగులో మనోహరుడు.ఎప్పుడెప్పుడా అని గత రెండు సంవత్సరాలుగు ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.చిత్ర టీజర్ చూసినవారికి కచ్చితంగా సినిమా మీద అంచనాలు పెరిగిపోతాయి.ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.అయితే సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' చిత్ర ఆడియో శిల్పకళా వేదికలో వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు.
చిరంజీవి మాట్లాడడానికి మైక్ తీసుకోగానే అభిమానులు పవన్ గురించి ప్రస్తావించారు.చివర్లో మాట్లాడుతాను అన్నారు కాని అభిమానులు మళ్ళీ అడగడంతో పవన్ ప్రస్థావన తీసుకొచ్చారు చిరంజీవి.'గోవిందుడు అందరివాడేలే' 150 రోజుల ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ వస్తే మీకేమైనా అభ్యంతరమా అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఇంకా చిత్రంలో నటించిన మరియు సాంకేతిక వర్గంలోని ప్రతీ ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యంగా సుద్దాల అశోక్ తేజ రచించిన పాట మనసుని హత్తుకుందని తెలిపారు చిరు.ఒకరోజు సినిమా షూటింగ్ అయ్యాక ఇంటికి వచ్చి సినిమాలో శ్రీకాంత్ తో నటిస్తుంటే సొంత బాబాయ్ తో నటించినట్టుందని రామ్ చరణ్ నాతో అన్నారు,అప్పుడు శ్రీకాంత్ నిజంగానే నీకు బాబాయ్ లాంటి వాడు అని అన్నానని చిరంజీవి తెలిపారు.
గోవిందుడు అందరివాడేలే చిత్ర 150 రోజుల వేడుకకు పవన్ కళ్యాణే వస్తారా లేక రామ్ చరణ్ ఆహ్వానిస్తారా లేకుంటే సినిమా 150 రోజులు ఆడే అంత బాగా ఉంటుందా వేచి చూడాల్సిందే.
శిల్పకళా వేదికలో జరిగిన 'గోవిందుడు అందరివాడేలే' ఆడియో కార్యక్రమంలో చిరంజీవి నటించబోయే 150వ చిత్రానికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది.రామ్ చరణ్ మాట్లాడుతూ నాన్నగారి 150వ చిత్రానికి అమ్మ ద్వారా నేనే నిర్మిస్తాను అని తెలిపారు.అంతకముందు నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ చిరంజీవి గారి 150వ చిత్రాన్ని నిర్మించే అవకాశం నాకు ఇవ్వాలని కోరారు.దీనిమీద స్పందించిన రామ్ చరణ్ ఆ అవకాశం నీకులేదని 150వ చిత్రం నాదే అని చెప్పారు.ఇదే విషయమై చిరంజీవి మాట్లాడుతూ మంచి కథ కోసం చూస్తున్నాను కథ దొరకగానే సినిమా మొదలవుతుంది అని అన్నారు.బహుశ ఈ సంవత్సరం చివరికల్లా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని అన్నారు.ఇంకా మాట్లాడుతూ బండ్ల గణేష్ కు నిర్మాతగా తరువాత చిత్రాల్లో అవకాశం ఇస్తాను అని,అతను బండ్ల గణేష్ కాదని బడ్జెట్ గణేష్ అని చమత్కరించారు చిరంజీవి.

'గోవిందుడు అందరివాడేలే' అన్ని పాటల వీడియో ప్రోమోలు ఆడియో కార్యక్రమం రోజే విడుదల చేశారు.


రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' అక్టోబర్ 1న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.సోమవారం సాయంత్రం శిల్పకళా వేదికగా జరిగిన చిత్ర ఆడియో ఫంక్షన్ లో స్వయంగా హీరో రాంచరణ్ ప్రకటించారు.ఈ ఆడియో కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పరమేశ్వర ఆర్ట్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రానికి కృష్ణవంశి దర్శకత్వం వహించారు.మొదటిసారిగా రామ్ చరణ్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గ నటించింది.
కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ తాలుకా శివల్లి గ్రామంలో వద్దని వారించిన ప్రేమించుకుంటున్నారని కోపంతో ప్రేమికులను అమ్మాయి దగ్గరి బంధువు కొట్టి చంపాడు. 17 సంవత్సరాల నీలమ్మ లక్కమ్మనవార్ 10వ తరగతి చదువుతుంది.నీలమ్మ మరియు కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసిన 19 సంవత్సరాల మహేష్ నైఖర్ అనే అబ్బాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ధార్వాడ్ రూరల్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ కళ్ళప్ప చెప్పినదాని ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నీలమ్మ ఇంట్లో ఎవరు లేరు.అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మాయి బంధువు రంగప్ప లక్కమ్మనవార్ ఆ ఇద్దరినీ ఇంట్లో ఉండడాన్ని గమనించి ఇనుప రాడ్ తో వారిమీద దాడి చేశాడు.అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
అయితే వీరి ప్రేమ వివాహం ఇదివరకే పెద్దవారికి తెలిసి మందలించారు.నీలమ్మ కురుబ కమ్యూనిటీకి చెందగా మహేష్ షెడ్యూల్ కులానికి చెందినవాడు.అమ్మాయికి చెందిన వారు ఇందుకు అభ్యంతరం చెప్పారు.మరియు ఇద్దరినీ హెచ్చరించారు.అయినా వినకపోవడంతో చివరకు ఇద్దరినీ హత మార్చారు.
దేశంలోనే మొదటిసారి ఈ-క్యాబినెట్ నిర్వహించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది.
క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన ప్రతీసారి మంత్రుల చేతిలో పేపర్లు,ఫైళ్లు కనిపిస్తాయి.అందుకు భిన్నంగా సోమవారం చంద్రబాబునాయుడు నిర్వహించిన క్యాబినెట్ కు మంత్రులు ఐపాడ్ లతో హాజరయ్యారు. 1995 నుండి 2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబునాయుడు ఈ-గవర్నెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు.ఈ దఫా కూడా ‘క్లౌడ్’ లాంటి టెక్నాలజీని వాడుకునే పనిలో పడ్డారు చంద్రబాబు.
ప్రస్తుతం ఈ-క్యాబినెట్ కోసం ‘ఫైల్ క్లౌడ్’ టూల్ ద్వారా మంత్రులు మరియు ప్రభుత్వ అధికారులు ఫైల్ షేరింగ్ జరుపుకునే అవకాశం ఉంది. ఇది విజయవంతం అవడంతో ఇకనుండి ఈ విధానాన్నే అనుసరించనున్నారు చంద్రబాబునాయుడు.
ప్రముఖులకు అత్యున్నత పురస్కారల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసులు చేసినట్లు సమాచారం.
మాజీ ప్రధాని పి.వీ నరసింహరావుకు - భారతరత్న,
ప్రొ.జయశంకర్ కు - పద్మభూషణ్,
ప్రొ.రాంరెడ్డికి - పద్మ విభూషణ్
సీనియర్ డైరెక్టర్ నర్సింగరావు ,కాపు రాజయ్యకు - పద్మ శ్రీ,
ప్రభుత్వ రాజముద్ర రూపకర్త ఏలే లక్ష్మణ్, వైకుంఠంకు - పద్మశ్రీ ప్రధానం చేయాలని కోరాలని నిర్ణయించినట్లు సమాచారం.
వీరితో పాటు మరికొంత మంది పేర్లను కూడా కేంద్రానికి సిఫారసు చేసినట్లు సమాచారం.

యువతీ యువకులు ఫేస్ బుక్ మాయలో పడి మోసపోతున్న ఉదంతాలు మనకు తెలుసు.
అయితే ఓ యువకుడు ఫేస్ బుక్ లో కొత్త అమ్మను వెతుక్కుని కన్న తల్లిని వదిలేసిన విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో జరిగింది.
బరేలీ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విజయ్ మౌర్య అనే 20 ఏళ్ల విద్యార్ధి-ఫేస్ బుక్ మమ్మీ కోసం కన్న వారిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.
పొద్దస్తమాను ఫేస్ బుక్ అతుక్కుపోయే అందరి యువకుల్లాగే తన కొడుకు కూడా అన్ని విషయాలు తమ స్నేహితులతో షేర్ చేసుకుంటున్నాడని విజయ్ మౌర్య అనుకున్నాడు.
'ముఖ పుస్తకం'కు అదే పనిగా అంటుకుపోవడాన్ని విజయ్ తండ్రి బ్రిజేష్ అప్పట్లో గమనించినా పెద్దగా పట్టించుకోలేదు.
విజయ్ గతనెల కనిపించకుండా పోయాడు.దీంతో పోలీసులను అతడి తల్లిదండ్రులు ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.
విజయ్ -'ఫేస్ బుక్ మమ్మీ'సుకన్య (పేరు మార్చారు)ని కలుసుకోడానికి వెళ్ళాడని తెలుసుకొని వారంతా అవాక్కయ్యారు.
విజయ్ కేరళకు చెందిన ఆమెని తన తల్లిగా చెప్పుకోవడంతో కన్నవాళ్ళు కన్నీరు మున్నీరయ్యారు. త్రివేండ్రం కు చెందిన సుకన్య బహ్రయిన్ లో నర్స్ గా పని చేస్తుంది.
ఆమే రూ.22 వేలు విజయ్ బ్యాంకు ఖాతాలోకి బదిలీ కూడా చేసింది.అంతేకాదు తన 'ఫేస్ బుక్ కొడుకు' తో ఈ నెల 12 న ఏకంగా బరేలీకి వచ్చింది.
సుకన్య,విజయ్ లు ఇక్కడి నుంచి వెళ్లిపోకుండా పోలీసులు,కుటుంబసభ్యులు వారికి నచ్చజెప్పి ఆపగలిగారు.
ఇక వివాదంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.బీజేపి నాయకులు విజయ్ కుటుంబానికి బాసటగా నిలవడం గమనార్హం.
దీన్ని 'ప్రణాళికబద్దమైన కుట్ర'గా వర్ణించారు.కమలనాధులు హిందూ యువకుడిని క్రిస్టియన్ గా మార్చేందుకు ఈ కుట్ర చేశారని ఆరోపించారు.
అయితే ఫేస్ బుక్ తల్లి కోసం పాకులాడుతూ అసలు తల్లిని వదిలేసిన విజయ్ గురించి వింతగా చెప్పుకుంటున్నారు.ఈ కథ మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
15 రోజుల వ్యవధిలో ఏడుగురిని అత్యంత కర్కశంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్,రేపిస్ట్ ను తమిళనాడు లోని సేలం జిల్లలో పోలీసులు అరెస్ట్ చేశారు.ఏడుగురిలో 5 గురు మహిళలు రెండు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది.
పోలీసుల కథనం ప్రకారం కతిరిపట్టి గ్రామానికి చెందిన 27 సంవత్సరాల సుబ్రహ్మణ్యన్ ట్రక్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు.ఒంటరిగా ఉండే గృహిణులను ముఖ్యంగా లక్ష్యం చేసుకుంటాడు.సేలం,ఆరియలూర్,తిరూచి జిల్లాల్లో తిరుగుతూ హత్యలకు పాల్పడ్డాడు.మూడు హత్యచార కేసులు కూడా ఇతని మీద పోలీసులు నమోదు చేశారు.
పెరియేరి గ్రామంలో ఒక దుకాణంలో దొంగతనం చేస్తూ దుకాణదారుడి మీద దాడి చేస్తుండగా గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.తరువాత పోలీసులు జరిపిన విచారణలో సేలం,అరియాలూర్,తిరూచి జిల్లాలో చేసిన హత్యల గురించి విషయం బయటపడింది.
ఇంట్లో పినతల్లి చిత్రహింసలు భరించలేక తన 17వ ఏట ఇంటి నుండి పారిపోయాడు సుబ్రహ్మణ్యన్.ట్రక్ క్లీనర్ గా ఉద్యోగం చేస్తూ డ్రైవింగ్ నేర్చుకొని ట్రక్ నడుపుతున్నాడు.కాని ఎక్కడ ఒక దగ్గర నిలకడగా పని చేసుకునే వాడు కాదు.నార్త్ ఇండియా లో 5 సంవత్సరాలు ఉండి మల్లి సొంత జిల్లాకు చేరుకున్నాడు.
సుబ్రహ్మణ్యన్ మొదట తన నానమ్మను 2012 లో హత్య చేశాడు.నెల క్రితం వరకు సేలం సెంట్రల్ జైల్లో ఉండి బైల్ మీద విడుదలయ్యాడు.డబ్బు కోసం సేలం,అరియాలూర్ లలో రహదారులమీద రాత్రి వేళల్లో కాపుకాచి ప్రయాణికుల దగ్గర డబ్బులు దోచుకునేవాడు.ఆగష్టు 20 న ఉలిపురంలో చిన్నతయీ(45)అనే ఆవిడ మీద అత్యాచారం చేసి హత్య చేసి ఇంట్లో ఉన్న రూ.10,000 దొంగిలించాడు.మరుసటి రోజు కల్లకుడి లో 82 సంవత్సరాల జయమేలును చంపి రూ.1000 దోచుకేల్లాడు.
సరిగ్గా ఎనిమిది రోజుల తరువాత కైరలబాత్ లో లక్ష్మీ(75),సావిత్రి(50)లను హత్య చేశాడు.సావిత్రిని అత్యాచారం కూడా చేశాడు.వారి ఇంటి నుండి రూ.900 తీసుకెళ్ళాడు.సెప్టెంబర్ 5న సెంతమంగళం గ్ర్రామంలో నిద్రిస్తున్న పార్వతి(25) మీద దాడి చేయగా ఆవిడ భర్త వెలుమురుగన్ అడ్డగించగా అతనిని హత్య చేశాడు,తరువాత ఆవిడమీద అత్యాచారం చేసి చంపేశాడు.వారి 2 సంవత్సరాల చిన్నారిని కూడా చంపేశాడు.అని అత్తూర్ డీఎస్పీ కాసినాతాన్ చెప్పారు.ఇంకా వీడు ఏమైనా నేరాలకు పాల్పడ్డాడ అని పోలీసులు విచారిస్తున్నారు.
గత వారం వ్యభిచారం చేస్తూ బంజారాహిల్స్ లోని ఒక విలాసవంతమైన హోటల్ లో 23 సంవత్సరాల నటి శ్వేత బసు ప్రసాద్ పట్టుబడిన విషయం తెలిసిందే.జాతీయ అవార్డు విజేత అయిన శ్వేత పేరును పోలీసులు బహిరంగా పరిచారు కాని ఆమెతో పట్టుబడిన వ్యాపారవేత్త పేరును మాత్రం బయటపెట్టలేదు అని ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి.పట్టుబడ్డ వ్యాపారవేత్త పేరు కూడా బయటపెట్టాలని పెద్దెత్తున డిమాండ్ వచ్చింది.
ఈ సెక్స్ రాకెట్ తో సంబంధం ఉన్నది ఎవరో తెలుసుకోవాలని కోర్టు అనుకుంటుంది.శ్వేత కేసు ఈరోజు కోర్టులో హియరింగ్ కు రానున్న సందర్భంలో వ్యాపారవేత్త ఎవరో బయటపెట్టాలని కోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాలతో అతను ఎవరో ఈరోజు తెలిసే అవకాశం ఉంది.
అరెస్ట్ చేసిన శ్వేత బసు ప్రసాద్ ను ప్రస్తుతం మహిళా సంరక్షణ గృహంలో ఉంచారు.అయితే చాలా మంది హీరోయిన్స్ వ్యభిచార వృత్తిలో ఉంటున్నారు అని శ్వేత సంచాల వ్యక్యలు చేసింది.
ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పండగ చేస్కో' రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుండి హైదరాబాద్ లో జరుగుతుంది.ఇటీవలే పొల్లాచి లో సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించి తిరిగివచ్చింది.రామ్ కు జతగా రఖుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తుంది.
పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు.ఈ చిత్రంలో హీరో రామ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తారు,హైవోల్టేజి కలిగిన మాస్ క్యారెక్టర్ ను రామ్ ఈ చిత్రంలో పోషిస్తున్నాడు అని డైరెక్టర్ గోపీచంద్ అన్నారు.ఇప్పటి వరకు చిత్ర షూటింగ్ అనుకున్నదానికంటే వేగంగా జరుగుతుంది,తాజాగా సోమవారం(సెప్టెంబర్ 15)నుండి హైదరాబాద్ లో మా చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది అని నిర్మాత కిరీటి అన్నారు.చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

రాయ్ పూర్ లో జరుగుతున్న ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయింగ్ మ్యాచ్ ల్లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు శ్రీలంకకు చెందిన సథరన్ ఎక్స్ ప్రెస్ పై సునాయాస విజయం సాధించింది.ఇంకా 22 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో ముంబై విజయాన్నందుకుంది.ముంబై ఓపెనర్లు హుస్సీ,సిమ్మన్స్ కలిసి మొదటి వికెట్ కు 139 పరుగులు జోడించాక హుస్సీ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు.తరువాత వచ్చిన పోల్లార్డ్ మూడు బారీ సిక్సర్ల సహాయంతో 20 పరుగులు చేయగా సిమ్మన్స్ 76 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సథరన్ ఎక్స్ ప్రెస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.మహరూఫ్ 41 పరుగులతో రాణించాడు.
జమ్మూ కాశ్మీర్ లో సంభవించిన వరదలవల్ల ఆ రాష్ట్రం తీవ్రంగ నష్టపోయిందని అసోచామ్ వెల్లడించింది. ఈ వరదలు 5 వేల కోట్లకు పైగా నష్టాన్ని ఆ రాష్టానికి తెచ్చిపెట్టాయని తెలిపింది.వ్యాపార, పర్యాటక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అసోచామ్ పేర్కొంది.
ప్రధాని నరేంద్రమోడీ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు.
తన పుట్టిన రోజు వేడుకలను తన అభిమానులేవరు కూడా నిర్వహించరాదని కోరారు.ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ఇవాళ స్పష్టం చేశారు.
వరదల్లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతోన్న కాశ్మీర్ వాసులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.
చేయు చేయి కలుపుదాం , భాదిత జమ్మూ కాశ్మీర్ వాసులకు చేయుతనిద్దామని కోరారు.జమ్మూ కాశ్మీర్ లో వరద సహాయక చర్యల్లో మీ వంతు పాలుపంచుకోండని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.తన పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్రమోడిని కలవనున్నారు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమస్యలపై ప్రధానితో చర్చించనున్నారు.
తెలంగాణా సర్కార్ జమ్మూ,కాశ్మీర్ లో సంభవిస్తోన్న భారివరదల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర తాగునీటి కొరతను ఎదురుకోనడంపై స్పందించింది.
ఆ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న బాధితులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ఈ మేరకు నిర్ణయించింది.
తక్షణమే జమ్మూ కాశ్మీర్ వరద ప్రాంతాలకు 50 వాటర్ ఫ్యురిఫయ్యర్లను పంపాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.రూ.2.5.మొత్తం వీటి విలువ కాగా, ఒక్కొక్కటి రూ.5లక్షలు చేస్తుందని అధికారులు తెలిపారు.
ఈ ఫ్యురిఫయ్యర్ల ద్వారా నీటిని శుభ్రపరచి అప్పటికప్పుడు తాగునీటిగా మార్చి అందించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు.
మొదటగా ఇవి శ్రీనగర్ చేరుకొని అక్కడినుంచి వరద ప్రాంతాలకు వెళ్లనున్నాయి.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వరద సహాయకంగా ఇప్పటికే రూ.10 కోట్లు వరద సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలుగు తెలిపే స్వాతంత్ర్యం పుట్టుకతోనే అది మన సొంతం
మదిలో ఉన్నభావం పదమై ఉప్పొంగాలి గళం
ఖండం ఏదైనా కానీ ఏ దేశంలో ఉన్నకానీ..
రాష్ట్రం ఏదైనా కానీ ఏ ప్రాంతంలో ఉన్న కానీ..
బాధ్యత తెలపాలి పాత తరం..భాగం అయ్యేలా కొత్త తరం..
కానక్కర్లేదు రక్త సంబంధం.. తెలుగే మన అనే ఓ బంధం..
అణగ ద్రోక్కేలా జాతి అహంకారం ఒక్కటవ్వాలి మనమందరం
                                                 ----జ్యోతి శ్రీరామోజు
మణిపూర్ లోని ఎన్ఐటీ కళాశాలలో విద్యార్ధుల మధ్య లోకల్ నాన్ లోకల్ ఘర్షణ తలెత్తింది.కళాశాలలో చదువుతున్న తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లకు చెందిన తెలుగు విద్యార్ధులపై మణిపూర్ విద్యార్ధులు దాడికి పాల్పడ్డారు.తెలుగు విద్యార్ధులపై గత నలుగు రోజులుగా దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం.దాడులపై విద్యార్ధులు ఎన్ఐటీ యాజమాన్యానికి ,స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విద్యార్ధులు తెలుపుతున్నారు.లోకల్ విద్యార్ధులు గుండాలతో కూడా దాడి చేయిస్తున్నట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.బిక్కుబిక్కు మంటూ తెలుగు విద్యార్ధులు కాలేజీలోనే ఉంటున్నారు.

నారా రోహిత్,విశాఖ సింగ్ జంటగా వస్తున్న చిత్రం 'రౌడీ ఫెలో' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్ర ఆడియోను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చి విడుదల చేయనున్నాడు.సెప్టెంబర్ 16న రౌడీ ఫెలో ఆడియో శిల్పకళా వేదికలో వైభవంగా నిర్వహించనున్నారు.
ప్రముఖ గీత రచయిత కృష్ణ చైతన్య మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మూవీ మిల్స్ మరియు బ్యానర్ 5 సంయుక్తంగా నిర్మించారు.ఇటీవలే చిత్రంలోని ఒక పాటను వాషింగ్టన్ లో రోహిత్,విశాఖ సింగ్ మీద చిత్రీకరించారు.
స్వామి రారా,ఉయ్యాల జంపాల వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన సన్నీ ఎంఆర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
సోషల్ మీడియా కంపెనీ యజమానులకు వరంగా మారింది.ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి నేపథ్యాన్ని తెలుసుకునే సాధనంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది.సోషల్ మీడియాలో వారిగురించి లభించిన ప్రతికూల అంశాల ఆధారంగా 68% మంది యజమానులు వ్యక్తుల నియామకానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నారని కెరీర్ బిల్డర్ చేసిన సర్వేలో తేలింది.
ఈ సర్వే ప్రకారం 59% కంపెనీలు తమకు సరిపోయే అభ్యర్థి కోసం ప్రస్తుతం సోషల్ మీడియానే సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి,33%కంపెనీలు తమకు కావాల్సిన ప్లాట్ ఫామ్ ఆధారంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయని సర్వే తెలిపింది.
దేశంలో నిర్వహించిన 1200 కార్పొరేట్ కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే రూపొందించారు.
అంతే కాకుండా 75% కంపెనీలు సామర్థ్యం ఉన్న ఉద్యోగులకోసం గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లు వాడుతున్నారు అని సర్వే తెలిపింది.
చాలా కంపెనీలు ఉద్యోగం కోసం వచ్చే వారిని తిరస్కరించడానికి ముఖ్య కారణం వారి విద్యార్హతలు తప్పుగా చుపిస్తున్నారట,దాదాపు 50% మంది తప్పుడు విద్యార్హతలతో ఉద్యోగం సంపాదించాలని చూస్తున్నారని,50%మందికి సరైన కమ్యూనికేషన్ స్కిల్ల్స్ లేవని,47% మంది సరికాని ఫోటోలు,తప్పుడు సమాచారం,రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారని,గత కంపెనీ గురించి రహస్యాలను 42% మంది బహిర్గతం చేస్తున్నారని సర్వే వివరించింది.
38% అభ్యర్థులు వారికున్న మందు అలవాట్లు లేక డ్రగ్ అలవాట్లను పోస్ట్ చేస్తున్నారట,35% మంది అందులో నేర ప్రవర్తన కలిగినవారని,32%మందికి ఇది వరకు కంపెనీల్లో లేదా సహచర ఉద్యోగుల్లో చెడ్డపేరు ఉంటుందని సర్వే సూచించింది.
కాబట్టి కార్పోరేట్ ఉద్యోగాల కోసం వెళ్ళే వారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చింది పోస్ట్ చేయకుండా ఉంటె మంచిది.
రెండు వారాల క్రితం వ్యభిచారం చేస్తూ పట్టుబడిన నటి శ్వేత బసు ప్రసాద్ కు మద్దతు రోజురోజుకు పెరిగిపోతుంది.తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనె చేరింది.శ్వేతను నిందించాల్సిన అవసరంలేదు,కుటుంబాన్ని పోషించుకోవడానికి తను ఆ మార్గం ఎంచుకుంది,అందులో తప్పులేదు,తనకు తన కుటుంబానికి అండగా నిలవండి అని దీపిక తెలిపింది.
అందరూ తనని తప్పుపట్టడం సరికాదు.తను ఎవరో మాకు తెలుసు కాబట్టి ఆమెకు ఎందుకు మద్దత్తుగా మేము ఉండకూడదు అని కూడా అన్నారు దీపిక.ఎందుకు దీన్ని పెద్ద కోణం చూస్తున్నారు.విమర్శించడం మాని తనకు ఏ విధంగా సహాయం పడాలో ఆలోచించాలి అని దీపిక చెప్పింది.
మగవారి దృష్టిలో అమ్మాయిలు 21 సంవత్సరాలు దాటితే అంత అందంగా కనిపించరని ఒక అంతర్జాతీయ అధ్యయన సంస్థ తెలిపింది.వారు ఈ అధ్యయనంలో చాలా ఆసక్తికర అంశాలు తెలిపారు.
20-24 వయసు మధ్య ఉన్న అమ్మాయిలు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తారు అని 50 సంవత్సరాల వయసు వరకు ఉన్న మగవాళ్ళు భావిస్తారు అని వారి అధ్యయనంలో తేలింది.అదే అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలు తమకంటే ఒక సంవత్సరం తక్కువ లేదా సమాన వయసు ఉన్న పురుషులు తమని చూడడాన్ని ఇష్టపడతారట.అదే 50 సంవత్సరాల వయసున్న స్త్రీలకు 48 లేదా 49 సంవత్సరాల వయసున్న పురుషులు ఆకర్షణీయంగా కనిపిస్తారట.కాని పురుషులు మాత్రం తమ వయసులో సగం కన్నా తక్కువ వయసు ఉన్న స్త్రీలు తమని చూడాలని అనుకుంటారని ఈ అధ్యయనం తెలిపింది.
పురుషులు మహిళల విషయంలో ఏవిధంగా ఊహించుకుంటారు అనేది పరిశీలిస్తే సంకోచం లేకుండా 20 సంవత్సరాలు వారికే తమ ఓటు అంటారు.ఒక గ్రాఫ్ ను కూడా ఈ అధ్యయనం విడుదల చేసింది.ఈ గ్రాఫ్ ప్రకారం 22 సంవత్సరాలు వయసు వచ్చే వరకు 20 సంవత్సరాల వయసప్పుడు ఉన్న అందాన్ని కోల్పోతారు
గ్రూప్ అర్హత మ్యాచ్ లో రాయ్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు లాహోర్ లయన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పోలార్డ్ నేతృత్వంలోని ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 మాత్రమే చేయగలిగింది.తారే 37 పరుగులతో రాణించగా హర్భజన్ చివర్లో 10 బంతుల్లో రెండు సిక్సులు ఒక ఫోర్ సహాయంతో 18 పరగులు చేశాడు.ఐజాజ్ చీమ రెండు వికెట్లు తీసుకున్నాడు.
136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.మధ్యలో కొంత వత్తిడికి లోనైనా చివర్లో వచ్చిన ఉమర్ అక్మల్ 18 బంతుల్లోనే 38 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.ఓజా 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
జమ్మూ కాశ్మీర్ వరదలతో అతలాకుతలమవుతున్న ప్రజలకు కేంద్రం వారం రోజులపాటు ఉచిత ఫోన్ కాలింగ్ సౌకర్యం కల్పించింది.ఆ రాష్ట్ర ప్రజలు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ద్వారా వారం రోజులపాటు ఎలాంటి చార్జీలు లేకుండా మాట్లాడుకోవచ్చని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
140 క్యారెక్టర్లలో ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ట్విట్ చేయడం వల్ల భాషా సామర్ధ్యం మెరుగుపడుతుందని ఓ సర్వే తాజా నివేదిక వెల్లడించింది.
ట్విట్టర్ లో ఎక్కువగా ఉపయోగించే 100 పదాలపై ఈ సర్వేలో భాగంగా పరిశోధన చేశారు.వాటిలో ఆర్ టీ(రీట్విట్),యు (వైఓయు) రెండు పదాలు మాత్రమే షార్ట్ కట్ గా ఉపయోగిస్తున్నారని తేలింది.
ట్విట్టర్ వినియోగ దారులకు 140 క్యారెక్టర్ల వల్ల భాషా మెరుగు పడటంతో పాటు తక్కువ పదాలతో అర్ధవంతంగా చెప్పడంపై మంచి అవగాహన వస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు.
| Copyright © 2013 Radio Jalsa News