హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన రామ్ 'పండగ చేస్కో'!

ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పండగ చేస్కో' రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుండి హైదరాబాద్ లో జరుగుతుంది.ఇటీవలే పొల్లాచి లో సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించి తిరిగివచ్చింది.రామ్ కు జతగా రఖుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తుంది.
పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు.ఈ చిత్రంలో హీరో రామ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తారు,హైవోల్టేజి కలిగిన మాస్ క్యారెక్టర్ ను రామ్ ఈ చిత్రంలో పోషిస్తున్నాడు అని డైరెక్టర్ గోపీచంద్ అన్నారు.ఇప్పటి వరకు చిత్ర షూటింగ్ అనుకున్నదానికంటే వేగంగా జరుగుతుంది,తాజాగా సోమవారం(సెప్టెంబర్ 15)నుండి హైదరాబాద్ లో మా చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది అని నిర్మాత కిరీటి అన్నారు.చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News