16 సంవత్సరాల తరువాత హాకీలో భారత్ కు స్వర్ణం,ఫైనల్ లో పాక్ చిత్తు


ఎట్టకేలకు భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో బంగారు పతాకాన్ని సాధించింది.16 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఫైనల్ లో చిత్తు చేసి స్వర్ణం చేజిక్కించుకుంది.
ఇంచియాన్ వేదికగా జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్ లో భాగంగా పురుషుల హాకీ ఫైనల్ లో భారత్,పాక్ లు తలబడ్డాయి.హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు షూటౌట్ ద్వారా 4-2 తేడాతో పాక్ ను ఓడించి 2016లో జరిగే రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
ఆట నిర్ణీత సమయం 60 నిమిషాల్లో ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూటవుట్ ద్వారా నిర్ణయించారు.భారత గోల్ కీపర్ శ్రీజేష్ పాక్ ఆటగాళ్ళు కొట్టిన షాట్లు గోల్ కాకుండా అధ్బుతంగా అడ్డుకొని భారత్ కు స్వర్ణం అందించడంలో ముఖ్యపాత్ర పోచించాడు.

No comments:

Designed by vnBloggertheme.com | Copyright © 2013 Radio Jalsa News