రైల్ ప్రమాదంలో 12 మంది మృతి,45 మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వద్ద రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 12 మంది చనిపోగా 45 మందికి గాయాలయ్యాయి.
మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో రెండు ప్యాసింజర్ రైళ్లు అతి సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
వారణాసి నుండి గోరఖ్ పూర్ వెళుతున్న కృషక్ ఎక్స్ ప్రెస్ లక్నో నుండి బరౌనీకి వెళ్తున్న బరౌనీ ఎక్స్ ప్రెస్ ను ఢీకొంది.ఈ ఘటన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని రైల్వే అధికారి అలోక్ సింగ్ చెప్పారు.బరౌనీ రైలుకు చెందిన మూడు భోగీలు పట్టాలు తప్పాయని సింగ్ తెలిపారు.మరో అధికారి సక్సేనా మాట్లాడుతూ కృషక్ రైలు డ్రైవర్లు సిగ్నల్ పట్టించుకోకుండా ముందుకు సాగడంవల్ల ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.ఆ ఇద్దరు డ్రైవర్లను ఉద్యోగం నుండి వెంటనే తొలిగించారు.
క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News