మార్చి14న వస్తున్న 'ముద్దుగా'

వి.సతీష్ కుమార్ దర్శకత్వంలో సి.వి.రెడ్డి నిర్మించిన చిత్రం 'ముద్దుగా'.విక్రాంత్,పల్లవి ఘోష్ జంటగా నటిస్తున్నఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకి రానుంది.
దర్శకుడు మాట్లాడుతూ పూర్తిగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అని,చిత్రం మొత్తం పల్లెటూరి వాతావరణం ఉంటుంది అని అన్నారు. ఇంకా ఈ చిత్ర విశేషాలు చెప్తూ ముఖ్యంగా యువత,కుటుంబ ప్రేక్షకులు చూడదగ్గ చిత్రం ఈ 'ముద్దుగా', స్వచ్ఛమైన కుటంబ అనుబంధాల మధ్య ఓ ప్రేమజంట తమ ప్రేమను ఎలా గెలుచుకొంది? అన్నదే చిత్ర కథాంశం అని అన్నారు. క్లీన్ 'U' సర్టిఫికేట్ పొందిన ఈ చిత్ర ఆడియో ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందింది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News