ప్రేమికులను చంపేసిన అమ్మాయి బంధువు !

కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ తాలుకా శివల్లి గ్రామంలో వద్దని వారించిన ప్రేమించుకుంటున్నారని కోపంతో ప్రేమికులను అమ్మాయి దగ్గరి బంధువు కొట్టి చంపాడు. 17 సంవత్సరాల నీలమ్మ లక్కమ్మనవార్ 10వ తరగతి చదువుతుంది.నీలమ్మ మరియు కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసిన 19 సంవత్సరాల మహేష్ నైఖర్ అనే అబ్బాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ధార్వాడ్ రూరల్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ కళ్ళప్ప చెప్పినదాని ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నీలమ్మ ఇంట్లో ఎవరు లేరు.అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మాయి బంధువు రంగప్ప లక్కమ్మనవార్ ఆ ఇద్దరినీ ఇంట్లో ఉండడాన్ని గమనించి ఇనుప రాడ్ తో వారిమీద దాడి చేశాడు.అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
అయితే వీరి ప్రేమ వివాహం ఇదివరకే పెద్దవారికి తెలిసి మందలించారు.నీలమ్మ కురుబ కమ్యూనిటీకి చెందగా మహేష్ షెడ్యూల్ కులానికి చెందినవాడు.అమ్మాయికి చెందిన వారు ఇందుకు అభ్యంతరం చెప్పారు.మరియు ఇద్దరినీ హెచ్చరించారు.అయినా వినకపోవడంతో చివరకు ఇద్దరినీ హత మార్చారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News