స్వర్ణం గెలిచిన భారత మహిళా కబడ్డీ జట్టు

భారత మహిళా కబడ్డీ జట్టు 17వ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నెగ్గి తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది.ఇది భారత మహిళా కబడ్డీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకం.
శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఇరాన్ పై 31—21 తో గెలిచింది.కబడ్డీలో ఎదురులేని భారత మహిళా జట్టు కష్టపడకుండానే సునాయాసంగా గెలిచింది.గత ఆసియా క్రీడల నుండే మహిళా కబడ్డీ చేర్చారు.
భారత్ మహిళా జట్టు స్వర్ణం గెలవడం గర్వకారణమని,వారికి నా కృతజ్ఞతలు అని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News