బీహార్ ఉపఎన్నికల్లో చిత్తైన ఎన్డీఏ కూటమి

బీహార్ ఉపఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఊహించని విధంగా ఓటమిపాలైంది.బద్దశత్రువులు అయిన రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు లాలూ,జనతాదళ్(యునైటెడ్)నాయకుడు నితీష్ కుమార్ లు కాంగ్రేస్ తో కలిసి కూటమిగా ఏర్పడి ఉపఎన్నికలు జరిగిన 10 స్థాన్నాలకు గాను 6 స్థానాలను గెలిచి జయకేతనం ఎగురవేసింది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఉపఎన్నికల్లో నితీష్ కూటమి బీజేపీ కి షాక్ ఇచ్చింది.2010 ఎన్నికల్లో పదింటికి గాను 6 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.ఈ సారి రెండు స్థానాలు కోల్పోయింది.బీజేపీ సర్వశక్తులు ఒడ్డినా ఓటమి నుండి గట్టెక్కలేకపోయింది.ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణ వేగంగా క్షీణిస్తుంది అని చెప్పుకోవడానికి ప్రతిపక్షాలకు అవకాశం లభించింది అని చెప్పవచ్చు.గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న 40 ఎంపీ స్థానాలకు గాను 31 స్థానాలు గెలుచుకొని సత్తా చాటిన విషయం తెలిసిందే... Read More


No comments:

| Copyright © 2013 Radio Jalsa News