న్యూజిలాండ్ ను గెలిపించిన వర్షం

ఇంగ్లాండ్ ఆశలపై వరుణ దేవుడు నీళ్ళు చల్లాడు. 173 పరుగుల విజయ లక్ష్య చేధనను న్యూజిలాండ్  ముందుంచింది ఇంగ్లాండ్. వర్షం అంతరాయం కలిగించే సమయానికి న్యూజిలాండ్ 5.2 ఓవర్లు ముగిసే సరికి 52 పరుగులు చేసి ఒక్క వికెట్ కోల్పోయింది.
   కాని ఆ సమయానికి న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో 43 పరుగులు మాత్రమే అవసరం. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం న్యూజిలాండ్  9 పరుగుల తేడాతో విజయం సాధించింది.విలియమ్స్ 24,మెక్ కల్లమ్16 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
   టీ20 ప్రపంచకప్ లో భాగంగా శనివారం ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. మొయిన్ ఆలీ(36), మైకేల్ లంబ్(33), బట్లర్(32) రాణించారు.
 

No comments:

| Copyright © 2013 Radio Jalsa News