ఈ వారం విడుదలైన తెలుగు చిత్రాలు

ఈ వారం ఏకంగా ఆరు తెలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ చిత్రాల విశేషాలు పరిశీలిస్తే :
1.భారతీ గణేష్ దర్శకత్వంలో శ్రీహరి, తరుణ్, యామి గౌతమ్ నటించిన యాక్షన్,రొమాంటిక్ కామెడీ చిత్రం 'యుద్ధం', నట్టి కుమార్,నట్టి లక్ష్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
2.శివాజీ,అర్చన నటించిన చిత్రం 'కమలతో నా ప్రయాణం'. నరసింహ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇసనాక సునీల్ రెడ్డి, సిద్దార్థ్ బోగోలు సంయుక్తంగా నిర్మాతలు. ఈ చిత్రం కూడా శుక్రవారం విడుదలై  విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.
3.తమిళంలో విజయవంతమైన చిత్రం 'రాజా రాణి', ఈ సినిమాను తెలుగులో శుక్రవారం విడుదల చేశారు. మురుగదాస్ శిష్యుడు 'అట్లీ' దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయనతార,ఆర్య మరియు జై, నజ్రియా నజిమ్ జంటలుగా నటించారు.
4.అర్జున్ కుమార్తె ఐశ్వర్య, విశాల్ నటీనటులుగా నటించిన సినిమా 'ధీరుడు'.  భూపతీ పాండ్యన్ దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని కథానాయకుడు విశాల్ స్వయంగా తెలుగులో విడుదల చేయడం విశేషం.ఈ చిత్రం కూడా శుక్రవారం విడుదల అయింది.
5.తీర్థంకర్ దాస్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం 'హ్యాంగ్ - అప్' . సుధాకర్ కోమాకుల, నతాలియా రౌత్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం కూడా శుక్రవారం విడుదల అయింది. బిల్ గ్రామి కూడా ఒక నిర్మాత.
6.చివరిగా శనివారం విడుదలైన చిత్రం 'హృదయం ఎక్కడున్నది'. వి.ఆనంద్ దర్శకత్వంలో కృష్ణ మాధవ్, సంస్కృతీ నటించగా పవన్ మరియు సంజయ్ కలిసి నిర్మించారు ఈ చిత్రాన్ని.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News