ఇంగ్లాండ్ పై భారత్ విజయం

మీర్పూర్ : ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ లో భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 73 పరుగులు రైనా 54 పరుగులతో రాణించారు. అనంతరం 179 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News