వెస్టిండీస్ పై భారత్ సునాయాస విజయం

మీర్పూర్ : బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్నా టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ పై భారత్ సునాయాస విజయం సాధించింది. టాస్ గెలిచిన ధోని ముందుగా వెస్టిండీస్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.
భారత్ కట్టిదిట్టమైన బౌలింగ్ తో వెస్టిండీస్ ఆది నుండి పరుగులు చేయడానికి తడబడింది. 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేయగలిగింది విండీస్. 130 పరుగల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ మొదటి ఓవర్లోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయిన విరాట్ కోహ్లి(54), రోహిత్ శర్మ(62నాటౌట్) రాణించారు. చివర్లో మందకోడిగా ఆడడంతో ఇంకా 2 బంతులు ఉండగా విజయాన్ని అందుకుంది భారత్.



No comments:

| Copyright © 2013 Radio Jalsa News