మార్చి20న రామ్ గోపాల్ వర్మ ‘రౌడీ' ఆడియో

మంచు మోహన్ బాబు,విష్ణు ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌడీ' వీరికి జోడీగా 
జయసుధ, శాన్వి నటిస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో మార్చి20న విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.తిరుపతిలో మోహన్ బాబు విద్యా సంస్థ అయిన శ్రీ విద్యానికేతన్ స్కూల్ లో ఆడియో విడుదల చేయడానికి నిర్మాతల ప్లాన్ చేస్తున్నారు.ఇటీవలే విడుదల చేసిన 'నీ మీద ఒట్టు' అనే ప్రోమో పాటకు విశేష ప్రేక్షకాదరణ లభించిన విషయం తెలిసిందే.చిత్రాన్ని కూడా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు తేవడానికి చిత్ర యూనిట్ కసరత్తు చేస్తుంది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News