శ్రీలంక చేతిలో భారత్ ఓటమి

T20 ప్రపంచ కప్ లో భాగంగా సోమవారం శ్రీలంక తో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్ లో భారత్ శ్రీలంక చేతిలో ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అశ్విన్ 3 వికెట్లతో రాణించారు. 154 పరుగుల విజయ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా 20 ఓవర్లలో 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రైనా 41, యువరాజ్ 33 పరుగులు చేశారు. మలింగా 4 వికెట్లు తీసుకున్నాడు. భారత్ తన తదుపరి వార్మప్ మ్యాచ్ బుధవారం ఇంగ్లాండ్ తో తలబడుతుంది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News