సూచనలు, సలహాలను మెయిల్‌ చేయండి

ఈరోజు (శుక్రవారం)తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ జరిగింది.భేటీ ముగిసిన అనంతరం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఎజెండానే టీఆర్‌ఎస్ ఎజెండా అని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు,తెలంగాణ రాష్ట్ర అభివద్ధిని ప్రతిబింబించేలా మేనిఫెస్టో ఉండాలని నిర్ణయం తీసుకున్నామని శ్రీహరి చెప్పారు.
ఎవరైనా తమ అభిప్రాయాలను,సూచనలను తెలపాలి అనుకుంటే trsmanifesto@gmail.com కు మెయిల్ చేయాలని అన్నారు.
అలాగే పార్టీ కార్యాలయంలో సలహాల బాక్స్ కూడా ఏర్పాటు చేశామని తమ అభిప్రాయాలను,సమస్యలను మరియు సలహాలు ఎవరైనా తెలియచేయవచ్చు అని అన్నారు కడియం శ్రీహరి

No comments:

| Copyright © 2013 Radio Jalsa News