ఈ సారి మా దారి BJP - రాజశేఖర్ దంపతులు

టిడిపితో రాజకీయ అరంగేట్రం చేసిన రాజశేఖర్ దంపతులు దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, జగన్‌తో పడక తిరిగి వారు కాంగ్రెసు గూటికి చేరారు.
కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ లో ఉన్న చిరంజీవితో చాలా కాలంగా విభేదాలు ఉండడం, చిరంజీవి ఉన్న పార్టీలో ఉండడం ఇష్టంలేని రాజశేఖర్ దంపతులు కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చారు. తాజాగా భాజాపాలో చేరిన జీవిత మాట్లాడుతూ గుజరాత్ ముఖ్యమంత్రి, భాజపా ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆకర్షితులై తాము బిజెపిలో చేరుతున్నట్లు జీవిత చెప్పారు.మోడీ అధికారంలోకి రాడం వందకు నూటపది శాతం ఖాయమని జీవిత అన్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News