20-20 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ షురూ

20-20 ప్రపంచకప్ కు తెర లేచింది. మార్చి16 నుండి మార్చి 21 వరకు క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు జరుగుతాయి. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి అర్హత రౌండ్ లో తలపడతాయి.ఇది వరకు అర్హత పోరును వేరుగా నిర్వహించి, అర్హత పోరులో క్వాలిఫై అయిన రెండు జట్లకు  టీ20 ప్రపంచకప్ లో పోటీపడే అవకాశం కలిపించేవారు. ఈసారి మాత్రం ప్రపంచకప్ లో భాగం చేశారు.ఒక్కో గ్రూప్ నుండి ఒక్కో జట్టు సూపర్-10కు అర్హత సాధిస్తాయి.
అక్టోబర్12,2012 వరకు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో తొలి ఎనిమిది స్థానాలు ఉన్న జట్లను నేరుగా సూపర్-10కు అర్హత సాధించాయి.అప్పుడు 9,10 స్థానాలు సాధించిన బంగ్లాదేశ్,జింబాబ్వే లు క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఆడనుంది. గ్రూప్-ఎ లో బంగ్లాదేశ్,ఆఫ్గానిస్తాన్,హాంకాంగ్,నేపాల్ లు ఉండగా గ్రూప్-బి లో జింబాబ్వే,నెదర్లాండ్స్,ఐర్లాండ్,యూఎఈ లు పోటీ పడుతున్నాయి.<p>గ్రూప్-ఎ లో మొదటి స్థానం సాధించిన జట్టు గ్రూప్-2 లోని భారత్,పాకిస్తాన్,ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లతో కలిసి, గ్రూప్-బి లో మొదటి స్థానం సాధించిన జట్టు గ్రూప్-1 లోని దక్షిణాఫ్రికా,న్యూజిలాండ్,శ్రీలంక,ఇంగ్లాండ్ లతో కలిసి సూపర్-10 లో పోటీ పడనున్నాయి.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News