దక్షిణాఫ్రికా పై శ్రీలంక విజయం


టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో శ్రీలంక 5 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. పెరేరా 61,మాథ్యుస్ 43 పరుగులతో రాణించారు.
166 లక్ష్య చేదనతో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా తడబడింది. ఓపెనర్లు రాణించిన చివర్లో వికెట్లు త్వరత్వరగా కోల్పోయారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే సాధించి ఓటమిపాలైంది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News