ఆస్ట్రేలియా పై పాకిస్తాన్ విజయం

మీర్పూర్ : టీ20 ప్రపంచకప్ ఆసక్తికర పోరులో ఆస్ట్రేలియా పై పాకిస్తాన్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఉమర్ అక్మల్ 70 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 94 పరుగులు చేసి చేసి సెంచరీ చేజార్చుకున్నాడు.
192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆది లోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే వార్నర్,వాట్సన్ ఔట్ అవడంతో కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. అయితే మ్యాక్స్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 7ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 74 పరుగులు చేసి అఫ్రిది బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. విజయం సునయసమే అనుకున్నా మాక్స్ వెల్ ఔట్ అవడంతో మళ్ళీ కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. ఒత్తిడిలో వికెట్లు త్వరత్వరగా కోల్పోయి 20 ఓవర్లలో 175 పరుగులు చేసి అన్ని వికెట్లు కోల్పోయిది. ఉమర్ అక్మల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News