తెలంగాణా సీఎం పదవి దళితుడికే : జైరాం రమేష్

మొదటి నుండి తెలంగాణా రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి అని కెసిఆర్ ప్రకటిస్తూ వచ్చారు.అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామని చెపుతుంది.కరీంనగర్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి జైరాం రమేష్ విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు.తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందని జైరాం రమేష్ తెలిపారు. టీఆర్ ఎస్ తో పొత్తుపై అధిష్టానందే తుది నిర్ణయమని ఆయన అన్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News