18 సంవత్సరాల తరువాత ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో స్వీప్ చేసిన ఎబీవీపి

బీజేపీ విద్యార్థి విభాగం ఎబీవీపి(భారతీయ విద్యార్థి పరిషత్) 18 సంవత్సరాల తరువాత ఢిల్లీ యూనివర్సిటీ యూనియన్ ఎన్నికల్లో స్వీప్ చేసింది. కాంగ్రేస్ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యూ ఐ ని మట్టికరిపించి నాలుగింటికి నాలుగు స్థానాలు దక్కించుకొని సత్తా చాటింది.
ఎబీవీపి ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్,సెక్రటరీ మరియు జాయింట్ సెక్రటరీ స్థానాలను స్పష్టమైన మెజారిటీతో కైవసం చేసుకుంది.మోహిత్ నగర్ ప్రెసిడెంట్ గా,ప్రవేష్ మాలిక్ వైస్ ప్రెసిడెంట్ గా,ఖనిక షెఖావత్ సెక్రటరీగా,అషుతోష్ మాథుర్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
ఎన్నికల్లో విజయం సాధించిన ఎబీవీపి విద్యార్థి విభాగాన్ని బీజేపే జాతీయ అధ్యక్షుడు ట్విట్టర్ లో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News