దేశంలోనే మొదటి ఈ-క్యాబినెట్ !

దేశంలోనే మొదటిసారి ఈ-క్యాబినెట్ నిర్వహించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది.
క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన ప్రతీసారి మంత్రుల చేతిలో పేపర్లు,ఫైళ్లు కనిపిస్తాయి.అందుకు భిన్నంగా సోమవారం చంద్రబాబునాయుడు నిర్వహించిన క్యాబినెట్ కు మంత్రులు ఐపాడ్ లతో హాజరయ్యారు. 1995 నుండి 2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబునాయుడు ఈ-గవర్నెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు.ఈ దఫా కూడా ‘క్లౌడ్’ లాంటి టెక్నాలజీని వాడుకునే పనిలో పడ్డారు చంద్రబాబు.
ప్రస్తుతం ఈ-క్యాబినెట్ కోసం ‘ఫైల్ క్లౌడ్’ టూల్ ద్వారా మంత్రులు మరియు ప్రభుత్వ అధికారులు ఫైల్ షేరింగ్ జరుపుకునే అవకాశం ఉంది. ఇది విజయవంతం అవడంతో ఇకనుండి ఈ విధానాన్నే అనుసరించనున్నారు చంద్రబాబునాయుడు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News