ముంబై ఇండియన్స్ పై లాహోర్ లయన్స్ విజయం

గ్రూప్ అర్హత మ్యాచ్ లో రాయ్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు లాహోర్ లయన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పోలార్డ్ నేతృత్వంలోని ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 మాత్రమే చేయగలిగింది.తారే 37 పరుగులతో రాణించగా హర్భజన్ చివర్లో 10 బంతుల్లో రెండు సిక్సులు ఒక ఫోర్ సహాయంతో 18 పరగులు చేశాడు.ఐజాజ్ చీమ రెండు వికెట్లు తీసుకున్నాడు.
136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.మధ్యలో కొంత వత్తిడికి లోనైనా చివర్లో వచ్చిన ఉమర్ అక్మల్ 18 బంతుల్లోనే 38 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.ఓజా 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News