భారత్ విజయ లక్ష్యం 295 పరుగులు


లీడ్స్ వేదికగా జరుగుతున్న చివరి వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా తరువాత నిలకడగా ఆడుతూ భారత్ ముందు 295 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఓపెనర్ కుక్ 46,బట్లర్ 49 పరుగులుతో రాణించగా జో రూట్ 112 పరుగలు చేశాడు.చివర్లో బెన్ స్టోక్ వేగంగా ఆడి 24 బంతుల్లో రెండు సిక్సులు,మూడు ఫోర్ల సహాయంతో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.షమీ రెండు వికెట్లు తీసుకోగా,భువనేశ్వర్,ఉమేష్ యాదవ్,ఆశ్విన్,రైనా తల ఒక వికెట్ దక్కించుకున్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News