భారత్ చైనా మూడు ఒప్పందాలపై సంతకాలు

చైనా అధ్యక్షుడు అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత ప్రధాని మోడీ తో హయత్ హోటల్ లో భేటి అయ్యారు.
ఈ భేటి అనంతరం ఇరు దేశాల అధికారులు మూడు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
గుజరాత్ ,గ్వాంగ్ జూ ప్రావిన్స్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులు తొలి ఒప్పందంపై సంతకాలు చేశారు.గుజరాత్ లో పారిశ్రామిక పార్కు ఏర్పాట్లకు వీరి మధ్య ఒప్పందం కుదిరింది.
గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్, చైనా డెవలప్ మెంట్ బ్యాంక్ మధ్య రెండో ఒప్పందం జరిగింది. ఉపాధ్యక్షుడు రెండో ఒప్పందంపై , గుజరాత్ పారిశ్రామికాభివృద్ధి కార్పోరేషన్ కార్యదర్శి సంతకాలు చేశారు.
అనంతరం ఈ రోజు సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రయాన్ని సందర్శించారు.
ఈ రోజు సాయంత్రం సతీ సమేతంగా భారత పర్యటనకు వచ్చిన జిన్ పింగ్ కు మోడీ తేనెటీ విందు ఇచ్చారు.
ఆశ్రయంలో సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన తర్వాత ప్రధాని ఇచ్చిన తేనెటీ విందులో జిన్ పింగ్ పాల్గొని రాత్రికి ఆయన ఢిల్లీ బయల్దేరి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ,విదేశీ వ్యవహారాలమంత్రి సుష్మాస్వరాజ్ లతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధిలతో ఆయన భేటి కానున్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News