అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు 'గోవిందుడు అందరివాడేలే '

రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' అక్టోబర్ 1న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.సోమవారం సాయంత్రం శిల్పకళా వేదికగా జరిగిన చిత్ర ఆడియో ఫంక్షన్ లో స్వయంగా హీరో రాంచరణ్ ప్రకటించారు.ఈ ఆడియో కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పరమేశ్వర ఆర్ట్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రానికి కృష్ణవంశి దర్శకత్వం వహించారు.మొదటిసారిగా రామ్ చరణ్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గ నటించింది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News