చాలా కంపెనీలు సోషల్ మీడియా పోస్టులను చూసి జాబ్ అప్లికేషన్లను తిరస్కరిస్తున్నాయి !

సోషల్ మీడియా కంపెనీ యజమానులకు వరంగా మారింది.ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి నేపథ్యాన్ని తెలుసుకునే సాధనంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది.సోషల్ మీడియాలో వారిగురించి లభించిన ప్రతికూల అంశాల ఆధారంగా 68% మంది యజమానులు వ్యక్తుల నియామకానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటున్నారని కెరీర్ బిల్డర్ చేసిన సర్వేలో తేలింది.
ఈ సర్వే ప్రకారం 59% కంపెనీలు తమకు సరిపోయే అభ్యర్థి కోసం ప్రస్తుతం సోషల్ మీడియానే సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి,33%కంపెనీలు తమకు కావాల్సిన ప్లాట్ ఫామ్ ఆధారంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయని సర్వే తెలిపింది.
దేశంలో నిర్వహించిన 1200 కార్పొరేట్ కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వే రూపొందించారు.
అంతే కాకుండా 75% కంపెనీలు సామర్థ్యం ఉన్న ఉద్యోగులకోసం గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లు వాడుతున్నారు అని సర్వే తెలిపింది.
చాలా కంపెనీలు ఉద్యోగం కోసం వచ్చే వారిని తిరస్కరించడానికి ముఖ్య కారణం వారి విద్యార్హతలు తప్పుగా చుపిస్తున్నారట,దాదాపు 50% మంది తప్పుడు విద్యార్హతలతో ఉద్యోగం సంపాదించాలని చూస్తున్నారని,50%మందికి సరైన కమ్యూనికేషన్ స్కిల్ల్స్ లేవని,47% మంది సరికాని ఫోటోలు,తప్పుడు సమాచారం,రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారని,గత కంపెనీ గురించి రహస్యాలను 42% మంది బహిర్గతం చేస్తున్నారని సర్వే వివరించింది.
38% అభ్యర్థులు వారికున్న మందు అలవాట్లు లేక డ్రగ్ అలవాట్లను పోస్ట్ చేస్తున్నారట,35% మంది అందులో నేర ప్రవర్తన కలిగినవారని,32%మందికి ఇది వరకు కంపెనీల్లో లేదా సహచర ఉద్యోగుల్లో చెడ్డపేరు ఉంటుందని సర్వే సూచించింది.
కాబట్టి కార్పోరేట్ ఉద్యోగాల కోసం వెళ్ళే వారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చింది పోస్ట్ చేయకుండా ఉంటె మంచిది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News