హర్యానా,మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

చీఫ్ ఎలక్షన్ కమిషన్ హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ ప్రకటించింది.ఈ సందర్భంగా సీఈసీ సంపత్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈనెల 27ను నోటిఫికేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదిగా నిర్ణయించినట్లు తెలిపారు.మహారాష్ట్ర లో 288 MLA స్థానాలకు,హర్యానాలో 90 MLA స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ కానుంది.ఓటర్ లకు అసెంబ్లీ ఎన్నికల్లో నోటా సౌకర్యం ఉంటుందని స్పష్టం చేశారు.అక్టోబర్ 15న పోలింగ్, 19 న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News