చంద్రబాబు చేతులమీదుగా విడుదల కానున్న 'రౌడీ ఫెలో' ఆడియో


నారా రోహిత్,విశాఖ సింగ్ జంటగా వస్తున్న చిత్రం 'రౌడీ ఫెలో' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్ర ఆడియోను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చి విడుదల చేయనున్నాడు.సెప్టెంబర్ 16న రౌడీ ఫెలో ఆడియో శిల్పకళా వేదికలో వైభవంగా నిర్వహించనున్నారు.
ప్రముఖ గీత రచయిత కృష్ణ చైతన్య మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మూవీ మిల్స్ మరియు బ్యానర్ 5 సంయుక్తంగా నిర్మించారు.ఇటీవలే చిత్రంలోని ఒక పాటను వాషింగ్టన్ లో రోహిత్,విశాఖ సింగ్ మీద చిత్రీకరించారు.
స్వామి రారా,ఉయ్యాల జంపాల వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన సన్నీ ఎంఆర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News