జమ్మూ కాశ్మీర్ కు వాటర్ ప్యూరిఫయర్లు: సర్కార్

తెలంగాణా సర్కార్ జమ్మూ,కాశ్మీర్ లో సంభవిస్తోన్న భారివరదల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర తాగునీటి కొరతను ఎదురుకోనడంపై స్పందించింది.
ఆ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న బాధితులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ఈ మేరకు నిర్ణయించింది.
తక్షణమే జమ్మూ కాశ్మీర్ వరద ప్రాంతాలకు 50 వాటర్ ఫ్యురిఫయ్యర్లను పంపాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.రూ.2.5.మొత్తం వీటి విలువ కాగా, ఒక్కొక్కటి రూ.5లక్షలు చేస్తుందని అధికారులు తెలిపారు.
ఈ ఫ్యురిఫయ్యర్ల ద్వారా నీటిని శుభ్రపరచి అప్పటికప్పుడు తాగునీటిగా మార్చి అందించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు.
మొదటగా ఇవి శ్రీనగర్ చేరుకొని అక్కడినుంచి వరద ప్రాంతాలకు వెళ్లనున్నాయి.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వరద సహాయకంగా ఇప్పటికే రూ.10 కోట్లు వరద సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News