తెలుగు విద్యార్ధులపై దాడికి దిగిన మణిపూర్ నిట్ విద్యార్ధులు

మణిపూర్ లోని ఎన్ఐటీ కళాశాలలో విద్యార్ధుల మధ్య లోకల్ నాన్ లోకల్ ఘర్షణ తలెత్తింది.కళాశాలలో చదువుతున్న తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లకు చెందిన తెలుగు విద్యార్ధులపై మణిపూర్ విద్యార్ధులు దాడికి పాల్పడ్డారు.తెలుగు విద్యార్ధులపై గత నలుగు రోజులుగా దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం.దాడులపై విద్యార్ధులు ఎన్ఐటీ యాజమాన్యానికి ,స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విద్యార్ధులు తెలుపుతున్నారు.లోకల్ విద్యార్ధులు గుండాలతో కూడా దాడి చేయిస్తున్నట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.బిక్కుబిక్కు మంటూ తెలుగు విద్యార్ధులు కాలేజీలోనే ఉంటున్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News