మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతం


మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియలో భాగంగా శాస్త్రవేత్తలు మామ్ లోని లామ్ ను మండించారు.ఈ ప్రక్రియ ఎనిమిది దశల్లో జరిగింది.
సక్రమంగా అన్ని ఇంజన్లు పని చేస్తున్నాయని ఇస్రో నిర్ణయించుకున్నది.
మామ్ మార్స్ కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది.అంగారక గ్రహంపై ప్రయోగాల కోసం ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతమైంది.
దీంతో బారత అంతరిక్ష పరిశోధనలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది.
భారత్ అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన నాలుగో దేశంగా గుర్తింపు పొందింది.
మొదటి మూడు
1.అమెరికా
2.రష్యా
3.యూరోపియన్ యూనియన్
4.భారత్
అంగారక కక్ష్యలోకి మొదటి ప్రయత్నంలోనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా, అదేవిధంగా తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో,అతి తక్కవ వ్యయంతో గ్రహాంతర ప్రయోగాన్ని సునాయాసంగా ప్రయోగించిన ఇస్రోను చూసి ప్రపంచమే నివ్వెరపోయింది.
బుధవారం అంగారకుడి కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ ను(మామ్)ఇస్త్ర శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ఉదయం తెల్లవారుజామున 4:49 గంటలకు ప్రారంభమైన కక్ష్య ప్రవేశ ప్రక్రియ 8:05 గంటలకు ముగిసింది.ఇస్రో గ్రాండ్ స్టేషన్ కు ఆ వెంటనే సందేశాలు పంపడం ప్రారంభించింది.
కొద్ది రోజులుగా ఈ ప్రయోగంపై ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న యావత్ భారతదేశం ఈ శుభవార్త విని పులకరించిపోయింది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News