ఆర్ధిక సంఘానికి తెలంగాణా ప్రభుత్వ ప్రతిపాదనలు

వచ్చే ఐదేళ్ళ కోసం 14వ ఆర్ధిక సంఘాన్ని తెలంగాణా సర్కార్ సాయం కోరింది.
ఇవాళ రాష్ట్రంలో పర్యటిస్తున్న 14వ ఆర్ధిక సంఘాన్నికి రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించింది.
ఈ ప్రతిపాదనల విలువ రూ.23,475 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు.
వీటిలో పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణకు -రూ.4,216 కోట్లు.
చెరువుల పునరుద్ధరణకు, అభివృద్ధికి-రూ.4,200 కోట్లు.
ఐటీ రంగానికి రూ.1,901 కోట్లు.
వాటర్ గ్రిడ్ కు రూ.3,500 కోట్లు.
హరితహారానికి రూ.1000 కోట్లు.
ప్రాధమిక విద్యకు రూ.1,300 కోట్లు.
వ్యవసాయ విధ్యత్ కోసం రూ.1,300 కోట్లుగా పేర్కొంటూ ప్రతిపాదనలు రూపొందించి సమర్పించింది.
కేంద్ర పన్నుల్లో 50%నికి రాష్ట్రవాటాను పెంచాలని కోరింది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News