రిచర్డ్ రాహుల్ వర్మ భారత్ లో అమెరికా రాయబారిగా ఎంపిక

భారత సంతతి వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు ఒబామా అత్యంత కీలకమైన రాయబార బాధ్యతలు అప్పగింత నిమిత్తం ఎంపిక చేసుకున్నారు.
ఒబామా భారత్ లో అమెరికా రాయబారిగా రిచర్డ్ రాహుల్ వర్మ(45)పేరును ప్రతిపాదించారు.
ఆయన గురువారం రిచర్డ్ రాహుల్ వర్మ పేరును ప్రకటించారు.
భారత ప్రధాని నరేంద్రమోడి త్వరలో అమెరికా పర్యటనకు రానున్న నేపధ్యంలో ఈ కీలక ప్రతిపాదనను ఒబామా చేశారు.
దీంతో పాటు పరిపాలనా యంత్రాంగానికి సంబంధించి మరికొన్ని నియామకాలను ఒబామా చేపట్టారు.
రిచర్డ్ రాహుల్ వర్మ విషయంలో ఒబామా చేసిన ప్రతిపాదనను సెనేట్ ఆమోదించాల్సి ఉండి.
అదే జరిగితే..అత్యంత కీలకమైన ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి అమెరికా పౌరిడిగా రాహుల్ వర్మ ప్రత్యేకతను సాధిస్తారు.
ఆయన అమెరికా విదేశాంగ శాఖతో సహా వివిధ విభాగాల్లో కీలక పదవులు నిర్వహించారు.
ఆయన ప్రస్తుతం హ్యూమన్ రైట్స్ ఫస్ట్,ది క్లింటన్ ఫౌండేషన్, నేషనల్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూట్ బోర్డు లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాన్సీ పావెల్ రాజీనామా తర్వాత భారత్ లో అమెరికా రాయబారి పదవి ఖాళీగా ఉండి.వర్మ పేరును ఈ కీలకపదవికి ప్రతిపాదించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News