నవంబర్ 1 నుంచి కొత్త పింఛన్ విధానం-కేటీఆర్

పంచాయితీరాజ్ లో 100 రోజుల పాలన పై తెలంగాణా రాష్ట్ర పంచాయితీరాజ్,ఐటి శాఖ మంత్రి కేటిఆర్ నివేదిక విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నవంబర్ 1 నుంచి కొత్త పింఛన్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు.ప్రతి గ్రామంలో మంచి నీరు,రోడ్లు ,డ్రైన్లు ఏర్పాటే తమ ప్రాధాన్యమని వెల్లడించారు.
ఏటా రూ.వెయ్యి కోట్లు చిన్ననీటి పారుదల వ్యవస్థ పునరుద్ధరణకు కేటాయించనున్నట్లు చెప్పారు.
1,192 గిరిజన తండాలు,గూడేలను పంచాయితీలుగా గుర్తించినట్లు వివరించారు.
పింఛన్లను లబ్ధిదారులకు చేర్చేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు.
సమగ్ర సర్వే ద్వారా కోటి 6 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు తేలిందన్నారు.కంపూటర్లో 96 లక్షల కుటుంబాల వివరాలను నిక్షిప్తం చేసినట్లు పేర్కొన్నారు.
పంచాయితీరాజ్ కొత్త విధానం రూపొందించి త్వరలో ప్రకటిస్తామన్నారు.ఉపాధి హామీలో అక్రమాలు,సమస్యల పరిష్కారానికి హెల్ఫ్ లైన్ 1800 200 1001 ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News