నలంద యూనివర్సిటీ పునర్ ప్రారంభం.


బీహార్ లోని నలంద యూనివర్సిటీ పునర్ ప్రారంభమైంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ ప్రారంభ వేడుకల్లో ముఖ్యఅథిదిగా హాజరయ్యారు. ఈ సందర్భాంగా సుష్మా మాట్లాడుతూ..భారతీయ అభివృద్ధికి నలంద విశ్వవిద్యాలయం చిహ్నమని,భారతీయ సంస్కృతి వైభవానికి ఈ విశ్వవిద్యాలయం తార్కాణమని చెప్పారు. భారతీయ మేధస్సును నలంద,తక్షశిల విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి చాటి చేప్పాయని కొనియాడారు. సెప్టెంబర్ 1 నుంచి 15 మంది విద్యార్ధులతో నలంద విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఈ విశ్వవిద్యాలయాన్ని 2020 నాటికీ పూర్తి స్థాయిలో నవీకరించానున్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News