15 రోజుల్లో 7 హత్యలు - పోలీసులకు చిక్కిన సీరియల్ కిల్లర్ !

15 రోజుల వ్యవధిలో ఏడుగురిని అత్యంత కర్కశంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్,రేపిస్ట్ ను తమిళనాడు లోని సేలం జిల్లలో పోలీసులు అరెస్ట్ చేశారు.ఏడుగురిలో 5 గురు మహిళలు రెండు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది.
పోలీసుల కథనం ప్రకారం కతిరిపట్టి గ్రామానికి చెందిన 27 సంవత్సరాల సుబ్రహ్మణ్యన్ ట్రక్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు.ఒంటరిగా ఉండే గృహిణులను ముఖ్యంగా లక్ష్యం చేసుకుంటాడు.సేలం,ఆరియలూర్,తిరూచి జిల్లాల్లో తిరుగుతూ హత్యలకు పాల్పడ్డాడు.మూడు హత్యచార కేసులు కూడా ఇతని మీద పోలీసులు నమోదు చేశారు.
పెరియేరి గ్రామంలో ఒక దుకాణంలో దొంగతనం చేస్తూ దుకాణదారుడి మీద దాడి చేస్తుండగా గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.తరువాత పోలీసులు జరిపిన విచారణలో సేలం,అరియాలూర్,తిరూచి జిల్లాలో చేసిన హత్యల గురించి విషయం బయటపడింది.
ఇంట్లో పినతల్లి చిత్రహింసలు భరించలేక తన 17వ ఏట ఇంటి నుండి పారిపోయాడు సుబ్రహ్మణ్యన్.ట్రక్ క్లీనర్ గా ఉద్యోగం చేస్తూ డ్రైవింగ్ నేర్చుకొని ట్రక్ నడుపుతున్నాడు.కాని ఎక్కడ ఒక దగ్గర నిలకడగా పని చేసుకునే వాడు కాదు.నార్త్ ఇండియా లో 5 సంవత్సరాలు ఉండి మల్లి సొంత జిల్లాకు చేరుకున్నాడు.
సుబ్రహ్మణ్యన్ మొదట తన నానమ్మను 2012 లో హత్య చేశాడు.నెల క్రితం వరకు సేలం సెంట్రల్ జైల్లో ఉండి బైల్ మీద విడుదలయ్యాడు.డబ్బు కోసం సేలం,అరియాలూర్ లలో రహదారులమీద రాత్రి వేళల్లో కాపుకాచి ప్రయాణికుల దగ్గర డబ్బులు దోచుకునేవాడు.ఆగష్టు 20 న ఉలిపురంలో చిన్నతయీ(45)అనే ఆవిడ మీద అత్యాచారం చేసి హత్య చేసి ఇంట్లో ఉన్న రూ.10,000 దొంగిలించాడు.మరుసటి రోజు కల్లకుడి లో 82 సంవత్సరాల జయమేలును చంపి రూ.1000 దోచుకేల్లాడు.
సరిగ్గా ఎనిమిది రోజుల తరువాత కైరలబాత్ లో లక్ష్మీ(75),సావిత్రి(50)లను హత్య చేశాడు.సావిత్రిని అత్యాచారం కూడా చేశాడు.వారి ఇంటి నుండి రూ.900 తీసుకెళ్ళాడు.సెప్టెంబర్ 5న సెంతమంగళం గ్ర్రామంలో నిద్రిస్తున్న పార్వతి(25) మీద దాడి చేయగా ఆవిడ భర్త వెలుమురుగన్ అడ్డగించగా అతనిని హత్య చేశాడు,తరువాత ఆవిడమీద అత్యాచారం చేసి చంపేశాడు.వారి 2 సంవత్సరాల చిన్నారిని కూడా చంపేశాడు.అని అత్తూర్ డీఎస్పీ కాసినాతాన్ చెప్పారు.ఇంకా వీడు ఏమైనా నేరాలకు పాల్పడ్డాడ అని పోలీసులు విచారిస్తున్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News