రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు


ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డును ఈ సంవత్సరం రూ.9 లక్షల 50 వేలకు సింగిరెడ్డి జయేందర్ రెడ్డి దక్కించుకున్నారు.గత సంవత్సరం ఇక్కడి లడ్డు వేలంలో రూ.9 లక్షల 26 వేలకు తీగల కృష్ణారెడ్డి దక్కించుకున్నారు.
మొత్తం 24 మంది లడ్డు వేలంలో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకున్నారు.ఈసారి కూడా బాలాపూర్ వినాయకుడి లడ్డు రికార్డు ధర పలికింది.
1994 లో వినాయకుడి లడ్డు రూ.450 పలికింది.
2004 నుండి ఇప్పటి వరకు బాలాపూర్ లడ్డూ వేలంలో దక్కించుకున్న వారు.
2004 మోహన్‌రెడ్డి రూ.2.01
2005 శేఖర్ రూ.2.08
2006 తిరుపతిరెడ్డి రూ.3.00
2007 రఘునందనాచారి రూ.4.15
2008 కొలను మోహన్‌రెడ్డి రూ.5.07
2009 సరిత రూ.5.10
2010 శ్రీధర్‌బాబు రూ.5.30
2011 కొలను కుటుంబం రూ.5.45
2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ.7.50
2013 తీగల కృష్ణారెడ్డి రూ.9.26

No comments:

| Copyright © 2013 Radio Jalsa News